శరద్ పవార్కు అస్వస్థత | Sakshi
Sakshi News home page

శరద్ పవార్కు అస్వస్థత

Published Sun, Jan 24 2016 8:53 PM

శరద్ పవార్కు అస్వస్థత - Sakshi

నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు పుణెలోని రూబి ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం సురక్షితంగానే వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన శరీరంలో ఫ్లూయిడ్స్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు సంభవించాయని చెప్పారు.

కనీసం ఆయనను 24గంటలపాటు అత్యవసర విభాగం(ఐసీయూ)లో ఉంచనున్నారు. 72 ఏళ్ల పవార్ గత కొద్ది రోజులుగా డయాబెటిక్స్, రక్తపోటు, నోటి కేన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే, వీటికోసం ఆయన తీసుకున్న మందులు రియాక్షన్ ఇవ్వడం వల్లే ఉన్నపలంగా ఆస్పత్రిలో చేర్చించాల్సి వచ్చిందని కీలక వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.ల

Advertisement
Advertisement