చెన్నై:
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎడప్పాడి కే. పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి జయలలిత నమ్మిన ఐదుగురు ప్రధాన బంటుల్లో ఒకరు. పన్నీర్సెల్వం, నాథమ్ ఆర్. విశ్వనాథన్, వి.వైతిలిలింగమ్, పీ. పళనియప్పన్, పళనిస్వామిలు అమ్మకు అన్ని విధాల అండగా ఉంటూ పార్టీని నడిపించడంలో ముందున్న పంచ పాండవులు.
భూస్వామి కుటుంబంలో పుట్టిన పళనిస్వామి ఏఐడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్కున్న ప్రతిష్టను చూసి ఆకర్షితుడై 1982లో పార్టీలో చేరారు. 1987లో ఎంజీ రామచంద్రన్ చనిపోయినప్పుడు ఆయన వారసురాలిగా జానకి రామచంద్రన్ను కాదని, జయలలితను గట్టిగా సమర్థించారు. ఫలితంగా 1989లో మొదటిసారి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం లభించింది. జయలలితకు తన మంత్రివర్గాన్ని తరచూ పునర్ వ్యవస్థీకరించడం అలవాటు. ఎక్కువ మందిని తొలగిస్తూ కొత్తవారిని తీసుకుంటారు. 2011 నుంచి 2016 వరకు ఒక్కసారి కూడా మంత్రివర్గం నుంచి వేటు పడని చాలా తక్కువ మందిలో పళనిస్వామి ఒకరు.
పార్టీ తరఫున రాజకీయ పొత్తుల వ్యవహారాలన్నింటిని పళనిస్వామి స్వయంగా చూసుకునేవారు. అమ్మ తరఫున మిత్రపక్షాలతో చర్చలు జరిపేవారు. 2016లో ఎన్నికల పొత్తు గురించి చర్చలు జరిపేందుకు జయలలిత పన్నీర్ సెల్వంను పూర్తిగా పక్కనబెట్టి పూర్తి బాధ్యతలను పళనికే అప్పగించారు. ఆయన పార్టీ కార్యకలాపాల్లో విజయం సాధించడానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కొంగు వెల్లాల గౌండర్’ కులం ప్రభావం కూడా ఎంతో ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకే పశ్చిమ తమిళనాడులో అఖండ విజయం సాధించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ ప్రాంతంలోని 55 సీట్లకుగాను 45 సీట్లను పార్టీ గెలుచుకుంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సేలం ప్రాంతంలో 11 సీట్లకుగాను 10 సీట్లలో పార్టీ విజయం సాధించడంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత మరింత పెరిగింది.
డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించినప్పుడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం నామినేషన్ను పళనిస్వామి వ్యతిరేకించినట్లు వార్తలొచ్చాయి. అప్పుడే పళనిస్వామి శాసనసభాపక్ష నాయకుడిగా పార్టీ ఎన్నుకొని ఉంటే పార్టీలో సంక్షోభం ఏర్పడే ఆస్కారం ఉండేది కాదన్నది కూడా కొంత మంది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఒక్కసారి పళనిస్వామికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే తిరిగి తీసుకోవడం సాధ్యపడదని భావించిన చిన్నమ్మ శశికళ ఉద్దేశపూర్వకంగా తాత్కాలిక ముఖ్యమంత్రి బాధ్యతలు పన్నీర్ సెల్వంకు అప్పగించారన్న వాదన కూడా ఉంది. చివరకు ఎలాగు సుప్రీం కోర్టు తీర్పు కారణంగా జైలుకు వెళ్లాల్సి రావడంతో చిన్నమ్మ, పన్నీర్ సెల్వంను దెబ్బతీయడానికి పళనిస్వామిని ఎంపిక చేశారు.
సౌమ్యుడిగా ఉండే పన్నీర్సెల్వంకు కార్యనిర్వాహక రంగంలో బలహీనుడిగా ముద్రపడగా, పళనిస్వామికి మృధుభాషి, సౌమ్యుడే కాకుండా మంచి పాలనాదక్షుడనే ముద్ర కూడా ఉంది.
పంచ పాండవుల్లో పళనిస్వామి ఒకరు
Published Thu, Feb 16 2017 4:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాజువాకలో జనజాతర
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం జగన్ రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement