వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యాకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా? వారి మధ్య ఒప్పందాలు జరిగి ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారా? అవినీతి నేరాలకు ఒడిగట్టారా అనే విషయాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కామే బహిరంగంగా స్పష్టం చేశారు. ‘వారు(రష్యా) మా ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొట్టాలని భావించారు. ఆమె(హిల్లరీ క్లింటన్)ను గాయపరిచారు. అతడి(డోనాల్డ్ ట్రంప్)కి సహాయం చేశారు’ అని కామే ఆరోపించారు.
అదే సమయంలో ఎన్నికల సమయంలో అమెరికాకు చెందిన కొంతమంది ప్రత్యేకమైన పౌరుల ఫోన్లను ట్యాపింగ్ చేసే విషయాన్నిమాత్రం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రభావం చూపించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు కూడా సామాన్యుల నుంచి అగ్రస్థానాల్లో ఉన్న సంస్థల అధిపతులకు కూడా నచ్చలేదు.
ఈ నేపథ్యంలో అమెరికాలో గత ఏడాది(2016)నవంబర్ 8 జరిగిన ఎన్నికల్లో ట్రంప్తో కలిసి రష్యా ఏదైనా కుట్రలకు పాల్పడిందా అనే అంశంపై ఎఫ్బీఐ ఇప్పటికీ దర్యాప్తు చేస్తూనే ఉందని ఆయన ఓ ఇంటెలిజెన్స్కు స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికాలో ఎవరు అధ్యక్షుడు కావాలనే విషయంలో పుతిన్కు ఒక స్పష్టత ఉందని, అతడికి హిల్లరీ అధ్యక్షురాలు కావడం ఇష్టం లేదని, ట్రంప్ అధికారంలోకి రావాలని అతను నిర్ణయించుకున్నారని, ఆ ప్రకారమే ట్రంప్ అధికారంలోకి వచ్చాడని నేరుగా కామెంట్లు చేసి తాజాగా వివాదం రేపారు. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
అసలు ట్రంప్కు పవర్ ఎలా? రంగంలోకి ఎఫ్బీఐ
Published Tue, Mar 21 2017 8:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement