'ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బులు ఇప్పిస్తాం' | Sakshi
Sakshi News home page

'ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బులు ఇప్పిస్తాం'

Published Fri, Sep 4 2015 10:16 AM

'ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బులు ఇప్పిస్తాం' - Sakshi

హైదారాబాద్ : అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు ఆమ్మైనా సరే బాధితులకు ఎవరి డబ్బులు వారికి ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులకు మాట ఇచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు ఏపీ సీఎంను కోరారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రాంభమవ్వకముందు అగ్రిగోల్డ్ బాధితులు ఆయనను కలిశారు. వారికి ఎలాగైనా డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement
Advertisement