సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని యునెటైడ్ కింగ్డమ్ (యూకే) ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ ప్రతినిధి బృందం కితాబిచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సులభ వాణిజ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పరిశీలించడంలో భాగంగా రాష్ట్రానికి విచ్చేసిన ప్రతినిధి బృందం...రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్తో గురువారం సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పెట్టుబడులను తెలంగాణకు వచ్చేలా సహకరిస్తామని హామీ ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ను ప్రశంసించిన యూకే ప్రతినిధి బృందం.. తమ దేశంలోని పలు పారిశ్రామిక విధానాలను తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని సూచించింది. లాభనష్టాల అంచనా, ఎగ్జిట్ విధానం, సంస్కరణల్లో సున్నితత్వం, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై సలహాలిచ్చింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ఆయా సలహాలను సానుకూలంగా పరిశీలిస్తామని యూకే బృందానికి హామీ ఇచ్చారు. దేశంలో కొత్త రాష్ర్టంగా ఆవిర్భవించిన తెలంగాణ వినూత్న ఆలోచనలు, విధానాలతో ముందుకు సాగుతోందన్నారు. పరిశ్రమ లు, ఐటీ సంస్థల భాగస్వామ్యంతోనే నూతన పారిశ్రామిక, ఐటీ పాలసీలను రూపొందించినట్లు చెప్పారు.
ఫిక్కీ, సీఐఐ వంటి పారిశ్రామిక సంఘాలతో పలుమార్లు సమావేశమై నూతన పాలసీలను తయారు చేశామన్నారు. విధానాల అమలుపైనా ఆయా సంఘాల నుంచి వచ్చే సలహాలు స్వీకరిస్తూ సులభ వాణిజ్యం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. కేటీఆర్ను కలసిన ప్రతినిధి బృందంలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ (హైదరాబాద్) ఆండ్రూ మెక్ అలిస్టర్, ఫిల్ ఓవెన్స్, రేచల్ హాలోవే తదితరులు ఉన్నారు. ఈ భేటీలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో యూకే పెట్టుబడులు
Published Fri, Aug 5 2016 3:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement