రౌడీషీటర్ మజ్హర్ అలీ రజ్వీ హత్య కేసు మిస్టరీని 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తుండడంతోనే అతడ్ని హతమార్చినట్లు తేల్చారు. ఈ మేరకు నలుగురు నిందితులను రెయిన్బజార్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ తరుణ్ జోషి మీర్చౌక్ ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ రంగారావులతో కలిసి వివరాలు వెల్లడించారు. పంజేషా గుల్జార్హౌస్ ఫాతుల్లా బేగ్ ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి మాజిద్ (20) చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడు. ఈ విషయం తెలిసిన డబీర్పురా కోమటివాడి ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ అయిన రౌడీషీటర్ మజ్హర్ నుంచి పోలీసులు రహస్యంగా వివరాలు సేకరిస్తున్నారు. దీంతో అతడు మాజిద్ను కలసి పోలీసులకు చెబుతానంటూ పలుమార్లు డబ్బులు డిమాండ్ చేశాడు.
కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతుడటంతో మజ్హార్ను అడ్డు తొలగించాలని మాజిద్ పథకం వేశాడు. స్నేహితులు యాకుత్పురా ముర్తుజానగర్ ప్రాంతానికి చెందిన తాఖీ అలీ అలియాస్ చోటు (23), పంజేషా గుర్నగల్లీ ప్రాంతానికి చెందిన మీర్జా ఫజిల్ నమాజీ అలియాస్ ఫజిల్ (24), బార్కాస్ ఎర్రకుంట ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ అబ్బు అలియాస్ వాజిద్ (21)ల సాయం కోరాడు. డబ్బులు ఇస్తామని మజ్హార్ను నమ్మించి సోమవారం అర్ధరాత్రి మౌలాకా చిల్లా గంగానగర్ నాలా శ్మశానవాటిక వద్దకు రప్పించి కత్తితో పొడిచి బండరాళ్లను మోది దారుణంగా హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసుల సహకారంతో మంగళవారం నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, మృతుడు, నిందితులపై పలు ఠాణాల్లో కేసులున్నాయి. మీర్జా ఫజిల్పై ఎలాంటి కేసులు లేవు.
అలీ రజ్వీ కేసును ఛేదించిన పోలీసులు : నలుగురి రిమాండ్
Published Wed, Aug 14 2013 4:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement