Sakshi News home page

ఆరేళ్ల బాలిక అనుమానాస్పద మృతి

Published Tue, Jul 28 2015 9:20 AM

6 years old girl suspicious death in vijayanagaram

విజయనగరం: ఆరేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణంలోని కొత్తపేటలో ఓ ఇంటి బావిలో చిన్నారి మృతదేహంను చూసి స్థానికులు గుర్తించారు. ఇంటి యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక సంబంధించిన ఆధారాలు తెలియరాలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

What’s your opinion

Advertisement