మెట్పల్లి: రైతులపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అల్లూరి మహేందర్రెడ్డి విమర్శించారు. పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన నిలబెట్టుకోలేదన్నారు.
ధాన్యం విక్రయించిన 24గంటల్లో డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామన్న ప్రభుత్వం 25రోజులు గడిచినా చెల్లించడం లేదన్నారు.రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్ఎస్ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అబ్బడి రాజిరెడ్డి, రాజేశుని రవీందర్, భూంరెడ్డి, గణేష్ తదితరులున్నారు.
రైతులపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు
Published Tue, Jan 10 2017 10:34 PM
Related news
-
మేనిఫెస్టోలో లేని విషయాలను మోదీ చెబుతున్నారు: చిదంబరం
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నాయకులు కాంగ్రెస్ మేనిఫెస్టో మీద కీలకవ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో 'వారసత్వ పన్ను' అనే పదం ఎక్కడా లేదని మాజీ ఆర్ధిక మంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. మేము రూపొందించని ఒక మేనిఫెస్టోను వారే క్రియేట్ చేసుకుని సభల్లో చెప్పుకుంటున్నారని చిదంబరం అన్నారు. ఈ అంశాలపైన మోదీ చర్చించాలని డిమాండ్ చేశారు.సామ్ పిట్రోడా ప్రస్తావించిన 'వారసత్వ పన్ను' వ్యాఖ్యలపై ప్రధాని పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడతున్న నేపధ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు మేనిఫెస్టోలో లేని అంశాలను గురించి మోదీ ప్రస్తావించడం ఏ మాత్రం సరికాదని చిదంబరం అన్నారు.మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే చాలా విపరీతాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేస్తామని చిదంబరం హామీ ఇచ్చారు.The Hon'ble Prime Minister continues to discover and read in the Congress' Manifesto words and sentences that are not there! He has imagined a Congress' Manifesto written by one of his ghost speech writers.The phrase 'inheritance tax' does not occur anywhere in the Manifesto.…— P. Chidambaram (@PChidambaram_IN) April 28, 2024 -
కాంగ్రెస్కు షాక్.. ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు ఢిల్లీలో షాక్ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా పార్టీ అధిష్టానం ఆప్తో పెట్టుకోవడంపై నిరసనగా రాజీనామా చేశారు. అధిష్టానం తన అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్కు రాసిన రాజీనామా లేఖ పేర్కొన్నారు. Arvinder Singh Lovely resigns from the position of Delhi Congress president."The Delhi Congress Unit was against an alliance with a Party which was formed on the sole basis of leveling false, fabricated and malafide corruption charges against the Congress Party. Despite that,… https://t.co/Y1A360fuut pic.twitter.com/hLP9RtnzUE— ANI (@ANI) April 28, 2024 -
తెరపైకి తెలుగు కాంగ్రెస్!
సాక్షి ప్రతినిధి, కడప: సార్వత్రిక ఎన్నికల పర్వంలో రాజకీయ పక్షాల అపవిత్ర కలయికలు తెరపైకి వస్తున్నాయి. తాము గెలవడం కంటే తమ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదురుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కొనసాగుతున్న మైత్రి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాము ఎటూ గెలవలేం, వైఎస్సార్సీపీని నియంత్రించడమే లక్ష్యం కావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటోంది. వెరసి తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకువచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంతో అభివృద్ధి చేశాం.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. మరోమారు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. తమ పాలనలో లబ్ధి చేకూరి ఉంటేనే ఆశీర్వదించండని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం కోరుతున్నారు. చరిత్రలో తన వల్ల మేలు చేకూరి ఉంటే ఓట్లు వేయండనే రాజకీయ నేత ఇంతవరకూ ఎవరూ లేరని ప్రజలు కొనియాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కుట్రలు, కుయుక్తులతో లబ్ధి పొందాలనే వైఖరిని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి గణనీయంగా పట్టు ఉన్న ఓటర్లలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మైనార్టీ ఓట్లు చీల్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.వ్యూహాత్మకంగానే అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వంజిల్లాలో వైఎస్ కుటుంబం అన్నా, వైఎస్సార్సీపీ అన్నా పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారీ్టలు అండగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనేక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే కడపలో రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎస్బి అంజద్బాషా విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మరోమారు తలపడుతున్నారు. ఈమారు వైఎస్సార్సీపీని ఎన్నికల్లో ఎలాగైనా నియంత్రించాలనే లక్ష్యంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. ఓవైపు విద్వేషాలు రెచ్చగొడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్తో చేతులు కలిపింది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం మైనారీ్టల ఓట్లు చీల్చేందుకు శతవిధాలా ప్రయతి్నస్తోంది. ఆమేరకే కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో దించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వం ఎంచుకోవడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ముస్లిం మైనార్టీలలో పఠాన్ తెగకు చెందిన వారిని తమ వైపు మరల్చుకోవాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించేందుకు రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కడప శివార్లలోని జయరాజ్ గార్డెన్లో తెలుగు కాంగ్రెస్ నేతలు సమావేశమై అఫ్జల్ఖాన్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలలో ఎందుకంటే... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ముస్లిం కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరింది. తద్వారా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కడపలో ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు 90వేలు ఉన్నారు. వీరి మద్దతు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగా కూడా టీడీపీకి వ్యతిరేకంగా నిలవనున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఓట్లలో చీలిక తీసుకువస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే దిశగా టీడీపీ నాయకులు అడుగులు వేశారు. ఆ మేరకు కాంగ్రెస్ పారీ్టతో చేతులు కలిపి కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్అభ్యర్థిగా ఎంపిక చేయించారు. ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పంథాను కొనసాగించారు. ప్రొద్దుటూరులో దాదాపు 45వేలు ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరిలో భారీగా చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో మహమ్మద్ నజీర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాయచోటిలో కూడా అల్లాబ„Š ఎంపిక వెనుక కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చడమే అసలు లక్ష్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇలా అవసరమైన మేరకు సహకరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో నిత్యం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్లో టచ్లో ఉన్నట్లు కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి జిల్లాలో తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు తెర ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. సంపదను ముస్లింకు పంపిణీ చేస్తామంటున్న కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం ఉందని మండిపడ్డారు. శనివారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హమీర్పూర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వెనక కాంగ్రెస్తో పాటు విదేశీ హస్తం ఉంది. మీ(ప్రజల) పిల్లల ఆస్తులను ముంస్లికు ఇవ్వనున్నారు. దేశానికి సంబంధించిన ఆణ్వాయుధాలను నాశనం చేయనున్నారు. కులం, మతం పేరుతో దేశం మొత్తాన్ని విభజించనున్నారు. టుక్డే-టుక్డే గ్యాంగ్ కాంగ్రెస్ చుట్టూ చేరి.. ఆ పార్టీ సిద్ధాంతాలను హైజాక్ చేస్తోంది. మీ( ప్రజలు) సంపద మీతోనా ఉండలా? లేదా ముస్లింలకు వెళ్లాలా? మీరే నిర్ణయం తీసుకోండి. మేము ముస్లింకు అన్ని హక్కులు సమానంగా కల్పించాం. కానీ, మత ప్రాతిపదికన మేము హక్కులు కల్పించలేదు. ఎందుకుంటే అవి ప్రజలందరి హక్కు’ అని మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.#WATCH | Hamirpur, Himachal Pradesh: Union Minister Anurag Thakur says, "In the Congress manifesto, along with the hand of the Congress, hands of foreign forces are also visible who want to give your children's property to Muslims, finish the nations nuclear weapons, divide the… pic.twitter.com/3dxJE6avvz— ANI (@ANI) April 27, 2024 అనురాగ్ ఠాకుర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన ఠాకుర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
కొల్హాపూర్/గోవా: కేంద్రంలో విపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానమంత్రులు కుర్చీ ఎక్కుతారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఆ కూటమి గెలిచే అవకాశమే లేనప్పటికీ ఎవరెప్పుడు ప్రధాని కావాలన్న దానిపై ఇప్పటినుంచే మంతనాలు సాగిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను దేశం భరించబోదని అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్తోపాటు గోవాలో ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. కర్ణాటకలో ఓబీసీల జాబితాలో ముస్లింలను చేర్చారని తప్పుపట్టారు. దీంతో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు దక్కడం లేదన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక మోడల్ దేశమంతటా అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. సామాజిక న్యాయాన్ని హత్య చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమా? అని నిలదీశారు. కాంగ్రెస్కు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలే తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. వారసత్వ పన్ను విధించి జనం ఆస్తులు లాక్కోవాలని చూస్తున్న పార్టీలను అధికారానికి ఆమడ దూరంలో ఉంచాలని ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నించింనందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికలు రెండు శిబిరాల మధ్య జరుగుతున్నాయని వివరించారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్న ఎన్డీయే ఒకవైపు, సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఉందని పేర్కొన్నారు.
Related News by category
-
జైబోలో హనుమాన్కీ..
● హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం ● భక్తులతో పులకించిన కొండగట్టు పుణ్యక్షేత్రం ● అంజన్న నామస్మరణతో మార్మోగిన ఆలయంకొండగట్టు/జగిత్యాల: ‘రామలక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్కీ..’ అంటూ కొండగట్టులోని అంజన్న ఆలయం పులకించిపోయింది. హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమాన్ దీక్షాపరులు మాల విరమణకు వేల సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం స్వామివారి జయంతి కావడంతో సుమారు 1.50లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు తెలిపారు. కొండపైకి వచ్చిన భక్తులు ముందుగా క్యూలైన్ ద్వారా స్వామి వారిని దర్శించుకోవాలని, ఇరుముడులను ఆలయంలో ఏర్పాటు చేసిన జాలీల్లో సమర్పించాలని, పాత కోనేరు ఎదురుగా ఉన్న మెట్ల నుంచి కల్యాణకట్ట వద్ద ఏర్పాటు చేసిన లైన్ల ద్వారా మండపంలోకి వెళ్లి మాల విరమణ చేసుకోవాలని, శ్రీరామకోటి స్తూపం వద్దగల షెడ్డులో తలనీలాలు సమర్పించాలని, కోనేరులో పుణ్యస్నానం ఆచరించి.. చివరగా ప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణం కావాలని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వొద్దని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. కొండగట్టులో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ప్రసాదం తీసుకునేందుకు 12 క్యూలైన్లు, ప్రత్యేక దర్శనం, మాల విరమణ, కేశఖండన టికెట్లకు ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. -
కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్నారు
మల్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మల్యాలలో సోమవారం రాత్రి రోడ్షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నవోదయ పాఠశాల ఎందుకు తీసుకురాలేదంటూ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్కుమార్ను గెలిపించుకోవాలని కోరారు. స్మార్ట్ సిటీ, ట్రిపుల్ ఐటీ తెచ్చిన ఘనత వినోద్కే దక్కిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలని అన్నారు. జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, మిట్టపల్లి సుదర్శన్, జనగాం శ్రీనివాస్, బోయినపల్లి మధుసూదన్రావు, సాగర్ రావు పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మల్యాలలో రోడ్షో -
గల్ఫ్ ట్రావెల్స్పై నిఘా కరువు
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని అదునుగా తీసుకుంటున్న కొంతమంది ట్రావెల్స్ యజ మానులు గల్ఫ్ ఏజెంట్ల అవతారం ఎత్తుతున్నారు. గల్ఫ్ పంపిస్తామంటూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లేవారి సంఖ్య రెండేళ్లుగా పెరుగుతోంది. అదేస్థాయిలో జిల్లాలో సుమారు 160 ట్రావెల్స్ అనధికారికంగా కొనసాగుతున్నాయి. సదరు ట్రావెల్స్ యజమానులు గ్రామీణులు, పట్టణ ప్రాంతాలంటూ తేడా లేకుండా ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాలతోపాటు 20 మండలాల్లో గల్ఫ్ ట్రావెల్స్ పేరున సుమారు 160 ట్రావెల్స్ ఉన్నాయి. వీరు వాస్తవానికి విమాన టికెట్స్ బుకింగ్ చేసేందుకే అనుమతి తీసుకుంటాయి. కానీ.. నిరుద్యోగుల అవకాశాన్ని ఆసరా చేసుకుని ఉపాధి కల్పిస్తామని చెప్పి నమ్మిస్తాయి. వారి నుంచి పాస్పోర్టులు తీసుకొని ఇంటర్వ్యూలకు హాజరుపరుస్తూ వీసా వచ్చిందని నమ్మిస్తూ అందినంతా దండుకుంటున్నాయి. అదే ట్రావెల్స్లో అనుమతులు లేకుండానే మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. నిరుద్యోగులు కూడా స్థానికంగా ఉన్న ట్రావెల్స్లకు లైసెన్స్ లేదని తెలిసినా.. వారిని నమ్మి లక్షలాది రూపాయలు చేతిలో పెట్టి మోసపోతున్నారు. 26 మందికే లైసెన్స్ జిల్లాలో గల్ఫ్ పంపించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కేవలం 26 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్లు తీసుకుని ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. మరో ముగ్గురు లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారు అనుమతులు లేకుండానే ట్రావెల్స్, ఏజెంట్లుగా చలామణి అవుతూ నిరుద్యోగులకు వీసాల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. లైసెన్స్ లేకున్నా ఇంటర్వ్యూలు గల్ఫ్ ఏజెంట్లు, ట్రావెల్స్ నిర్వాహకులు లైసెన్స్ ఉ న్నప్పటికీ ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసులకు స మాచారం అందించి ఇంటర్వ్యూలు నిర్వహించాలి. కానీ వారు పోలీసులకు ఎలాంటి సమాచారం లే కుండానే ఇష్టారీతిలో జిల్లాకేంద్రంలోనే పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ముంబయ్, చైన్నె, ఢిల్లీలో ఉన్న ట్రావెల్స్ యజమానులతో కలిసి ఈ తతంగం కొనసాగిస్తున్నారు. ని రుద్యోగులను ఇంటర్వ్యూలకు పిలిపించి అర్హత సా ధించారంటూ పాస్పోర్టులు తీసుకుంటున్నారు. అ నంతరం వారికి ఏదో ఒక వీసా అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పత్రికల ప్రకటనలు కూడా ఇస్తూ నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా వాట్సా ప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాల్లో ట్రావెల్స్ నిర్వాహకులు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. వారు ప్రచారానికి వాడే ప్రచార లైసెన్స్లు మాత్రం హైదరాబాద్, ముంబయ్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు చెందిన ట్రావెల్స్ల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. యూరప్ దేశాలకూ ఇంటర్వ్యూలు లైసెన్స్ ఉన్న ట్రావెల్స్ యజమానులు గల్ఫ్ దేశాలకు మాత్రమే నిరుద్యోగ యువకులను పంపించేవారు. కానీ ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా లైసెన్స్లు ఉన్న వారు, లేని వారు నిరుద్యోగులను యూరప్ దేశాల్లో ఉద్యోగాలున్నాయని సుమారు రూ.రెండు లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం పోలీసు శాఖ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటంతో ఇదే అదునుగా చూస్తున్న ఏజెంట్లు, ట్రావెల్స్ నిర్వాహకులు వారంరోజులుగా జోరుగా గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వీసా వచ్చిందని, (మెడికల్) వైద్య పరీక్షలు పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా అర్హత లేని ట్రావెల్స్ అనుమతులు లేకుండానే ఇంటర్వ్యూలు మెడికల్ టెస్ట్ పేరుతో వసూళ్లు నకిలీ వీసాలు అంటగట్టి మోసాలు జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సొంతూరులో ఉపాధి కరువవడంతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. వీరి అవకాశాన్ని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆసరాగా చేసుకుని రూ.లక్ష తీసుకుని ఏడాది కాలంగా విదేశాలకు పంపించకుండా మోసానికి పాల్పడ్డాడు. బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన ఇద్దరు యువకులు మంచిర్యాల జిల్లా కడెం మండలానికి చెందిన ఓ యువకుడు నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లికి చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్కు యూరప్ దేశానికి వెళ్లేందుకు రూ.9 లక్షలు చెల్లించాడు. ఏడాది గడుస్తోంది. దీంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లే వారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఎమిగ్రేషన్ చట్టబద్ధత ఉన్నవారి నుంచే వీసాలు పొందాలి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. బాధితులు ఫిర్యాదు చేస్తే మోసగాళ్లపై కేసులు నమోదు చేస్తాం. – సన్ప్రీత్సింగ్, ఎస్పీ -
నిజామాబాద్ లోక్సభకు 12 నామినేషన్లు
ఖలీల్వాడి: నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సోమవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్ మూడోసెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి కండెల సుమన్, స్వతంత్ర అభ్యర్థి ఆర్.రాజేందర్, రాపెల్లి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ అస్గర్ రెండోసెట్ నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు 28 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నాలుగోరోజు.. 14మంది నామినేషన్సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నాలుగో రోజు సోమవారం 14మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖల చేశారు. పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్కు వారు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంద రమేశ్, స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య,, ఆర్నకొండ రాజు, గడ్డం మారుతి, రాముల కార్తీక్, జుమ్మిడి గోపాల్, అంబాల మహేందర్, జనగామ నరేశ్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, దాగం సుధారాణి, జాడి ప్రేమ్సాగర్, అక్కపాక తిరుపతి ఒక్కోసెట్ నామినేషన్ పత్రం దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గద్దల వినయ్కుమార్, బొట్ల చంద్రయ్య రెండేసి సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 25 మంది అభ్యర్థులు మొత్తంగా 31 సెట్ల నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ అధికారంలోకొస్తే గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. రైతులను బీఆర్ఎస్, బీజేపీ పట్టించుకోలేదని, పసుపుబోర్డుపై అర్వింద్ ఉత్తర్వులతో సరిపెట్టారని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులు మృతిచెందితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. పసుపుబోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేస్తారా..? లేక అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తారా..? స్పష్టం చేయాల్సిన బాధ్యత అర్వింద్, బీజేపీపై ఉందన్నారు. నిజామాబాద్కు స్మార్ట్సిటీ తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. -
నాణ్యమైన ధాన్యం కొనాలి
బుగ్గారం/సారంగాపూర్: నాణ్యమైన ధాన్యాన్ని కొనాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. బుగ్గారం మండలం యశ్వంతరావుపేట, సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి పోతారం గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని రైతులకు నీడ, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆయన వెంట ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. నంచర్లలో శ్రీరాముడి రథోత్సవంపెగడపల్లి: మండలంలోని నంచర్లలోగల శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో ఐదురోజులుగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలు ముగిశాయి. సోమవారం స్వామివారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. జై శ్రీరాం జైజై శ్రీరాం..అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మండలం చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఎంపీపీ శోభ, ఆలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి వెంకన్న, మంత్రి హరిగోపాల్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీడీ టేకేదారుల కమీషన్ పెంచాలికోరుట్ల: బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న టేకేదారులకు కమీషన్ పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ టేకేదారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సుతారి రాములు కోరారు. పట్టణంలో సోమవారం టేకేదారులు సమావేశమయ్యారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి బీడీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయని, రెండేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం గడువు కూడా ముగిసిందని, ఈ క్రమంలో వెయ్యి బీడీల కమీషన్ రూ.18 నుంచి రూ.30కి పెంచాలని కోరారు. కార్యక్రమంలో టేకేదారులు సాంబయ్య, శంకర్, రవి, నర్సయ్య, సత్తయ్య, బాబురావు, బలరాం, భూమన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో ఆర్డీవో సమావేశంకోరుట్ల: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఆనంద్ కుమార్ సోమవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఓటరు సమాచార స్లిప్పులు, పోలింగ్ స్టేషన్ల లొకేషన్ మార్పుపై వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, బీజేపీ నాయకుడు ఆర్.సాయికృష్ణ, సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఎండీ.రషీద్ఖాన్, బీఆర్ఎస్ నాయకుడు జిందం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సరిహద్దు చెక్పోస్ట్ వద్ద తనిఖీలుసారంగాపూర్: మండలంలోని కమ్మునూర్ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్ట్ను అదనపు ఎస్పీ (ఏఆర్) భీంరావు సోమవారం తనిఖీ చేశారు. అనుమతిపత్రాలు లేకుండా వస్తువులు, నగదు తీసుకెళ్తే సీజ్ చేసి కేసు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎస్సై గౌతంపవార్ ఉన్నారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement