Sakshi News home page

రైతులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిన్నచూపు

Published Tue, Jan 10 2017 10:34 PM

రైతులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిన్నచూపు - Sakshi

మెట్‌పల్లి:  రైతులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అల్లూరి మహేందర్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన  నిలబెట్టుకోలేదన్నారు.

ధాన్యం విక్రయించిన 24గంటల్లో డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామన్న ప్రభుత్వం 25రోజులు గడిచినా చెల్లించడం లేదన్నారు.రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్‌ఎస్‌ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అబ్బడి రాజిరెడ్డి, రాజేశుని రవీందర్, భూంరెడ్డి, గణేష్‌ తదితరులున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement