సాక్షి, హైదరాబాద్/జగదేవ్పూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన అయుత చండీయాగం నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శుక్రవారం సీఎం దంపతులు నవ చండీయాగం నిర్వహించారు. అయుత చండీయాగానికి ముందు చేపట్టాల్సిన కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రత్యేక పూజలు చేశారు. గురువారం రాత్రే కేసీఆర్ దంపతులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకోగా.. శుక్రవారం ఉదయం శృంగేరి పీఠం వేద పండితులు వచ్చారు. చండీయాగం నిర్వహించే స్థలంలో నవ చండీయాగం నిర్వహించారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభ పట్టు వస్త్రాలు ధరించి నవ చండీయాగంలో పాల్గొన్నారు. ఉదయం 10:31 గంటలకు శృంగేరి వేద పండితులు, 12 మంది బ్రాహ్మణులు నవ చండీయాగాన్ని ప్రారంభించారు.
వేద పండితులు చండీ దేవతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు, సీఎం దంపతులు మంగళహారతి ఇచ్చారు. నవ చండీయాగం సాయంత్రం 3:50 గంటలకు వరకు కొనసాగింది. ప్రస్తుతం నవచండీయాగం నిర్వహించామని, ఇంకా 10 రకాల యాగాలను నిర్వహించాల్సి ఉందని శృంగేరి వేద పండితులు ఫణి శశాంక్శర్మ తెలిపారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు అయుత చండీయాగం నిర్వహిస్తామని చెప్పారు.
యాగానికి రాష్ట్రపతి!
వ్యవసాయ క్షేత్రం సమీపంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ యాగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాగం నిర్వహణకు కేరళ నుంచి అయిదు వేల మంది పండితులను రప్పిస్తున్నా రు. పది వేల పారాయణాలు, వెయ్యి హోమాలు ఏకకాలంలో నిర్వహిస్తారు. ఈ భారీ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన కేసీఆర్ చండీయాగానికి రావాలని ఆహ్వానించారు. దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్ 18 నుంచి 31 వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఆయన హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఇదే వ్యవధిలో చండీయాగం జరుగనుంది. సీఎం ఆహ్వానం మేరకు 27వ తేదీన రాష్ట్రపతి చండీయాగానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. అందుకు సంబంధించి సీఎం కార్యాలయానికి రాష్ట్రపతి భవన్ నుంచి ప్రాథమిక సమాచారం అందింది.
అయుత చండీయాగానికి సన్నాహాలు
Published Sat, Nov 28 2015 4:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement