కడప కార్పొరేషన్: జిల్లా వాసుల నిరీక్షణ ఫలించింది. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న పాస్పోర్టు కార్యాలయం కడపలో ఏర్పాటు కాబోతోంది. సోమవారం పాస్పోర్టు కార్యాలయం ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాస్పోర్టు కేంద్రాన్ని కడపలో ఏర్పాటు చేయించడంలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి విశేషంగా కృషి చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించడంతోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు పలుసార్లు లేఖలు రాశారు. ఎంపీ రాసిన లేఖలకు మంత్రి ఇటీవల రాతపూర్వకంగా సమా«ధానమిచ్చిన విషయం పాఠకులకు విదితమే. పాస్పోర్టు కార్యాలయ ఏర్పాటుకు కృషి చేయడమేగాకుండా సిబ్బంది అభ్యర్థన మేరకు ఫర్నీచర్, ఏసీలు తదితర సామగ్రి కోసం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి రూ.1.50 లక్షలు సొంతంగా వెచ్చించారు. ఎంపీ తోడ్పాటుతో అధికారులు పాస్ పోర్టు కార్యాలయానికి కావాల్సిన గదులను పూర్తి స్థాయిలో నిర్మించి, అసవరమైన ఫర్నీచర్ను సిద్ధం చేశారు. ఇది వరకు జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు, విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థులు, ఉద్యోగార్థులు పాస్పోర్టు కోసం తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లేవారు. ఈ క్రమంలో పాస్పోర్టు జారీలో ఆలస్యం అయినా, డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోయినా, ఇతరత్రా లోటు పాట్లు జరిగితే పలుమార్లు ఆ ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర వ్యయప్రయాసలకు లోనయ్యేవారు. దీంతో వారి సమయం వృథా కావడంతోపాటు, తీవ్ర శ్రమ పడాల్సి వచ్చేది. కడపలో పాస్పోర్టు సేవాకేంద్రం ఏర్పాటు కావడం వల్ల జిల్లా వాసులకు ఆ ఇబ్బంది నుంచి విముక్తి కలగనుంది. జిల్లాలో అత్యధిక మంది జీవనోపాధి కోసం గల్ఫ్ దే«శాలైన కువైట్, సౌదీఅరేబియా, ఖత్తర్కు వెళ్తున్నారు. అలాగే ఉన్నత చదువుల కోసం విద్యార్థులు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, రష్యా, చైనా వంటి దేశాలకు వెళ్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఏడాదికి దాదాపు 50 వేల మంది విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. కొత్త పాస్పోర్టుల కోసం ఇంతే సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం జిల్లాలో పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎట్టకేలకు జిల్లాలో పాస్ పోర్టు కార్యాలయం ఏర్పాటు అవుతుండటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడు కడపలో పాస్ పోర్టు కార్యాలయం ప్రారంభం
Published Mon, Apr 3 2017 12:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement