కడప వైఎస్సార్ సర్కిల్ : స్టోన్ క్రషింగ్ యూనిట్లు, ఎర్రగుంట్ల శ్లాబ్ పాలిష్ యూనిట్లు వ్యర్థాలను రహదారికి ఇరువైపులా వేస్తున్న వారికి చివరి నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటీసులు జారీ చేసిన తర్వాత వ్యర్థాలను తొలగించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రొద్దుటూరు అపెరల్ పార్కును సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కుగా ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వంద ఎకారల్లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల నుంచి అనుమతి పొందిన 54 పరిశ్రమలకు సంబంధించి ఆమోదం తెలిపారు. ఒక యూనిట్ను తిరస్కరించారు. అలాగే షెడ్యూల్ కులాల, తెగల వారికి పెట్టుబడి రాయితీ కింద 9 యూనిట్లకు రూ. 86.46 లక్షలు, పావలా వడ్డీ రాయితీ కింద 14 యూనిట్లకు రూ. 75.10 లక్షలు, విద్యుత్ రాయితీ కింద 8 యూనిట్లకు రూ. 13.25 లక్షలు, స్టాంప్ డ్యూటీ కింద మూడు యూనిట్లకు రూ. 13.46 లక్షలు, సేల్ట్యాక్స్ రాయితీ కింద ఏడు యూనిట్లకు రూ. 42.56 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం జయలక్ష్మి, ఎల్ఎం రఘునాథరెడ్డి, సోషల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ సరస్వతి, ఏపీఈఈసీ జోనల్ మేనేజర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వ్యర్థ పదార్థాలను రోడ్లపై వేస్తే నోటీసులు జారీ
Published Thu, Oct 13 2016 11:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement