రోడ్డు ప్రమాదంలో నవదంపతుల దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నవదంపతుల దుర్మరణం

Published Fri, Feb 9 2018 6:50 AM

newly married couple dead in road accident - Sakshi

బనశంకరి: రోడ్డు ప్రమాదంలో  నవదంపతులు దుర్మరణం చెందిన ఘటన రాణిబెన్నూరు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు....హవేరి జిల్లా రాణిబెన్నూరుకు చెందిన మల్లయ్యభజ్జీ (28), జ్యోతి భజ్జీ (25)లకు రెండు నెలల క్రితం వివాహమైంది. గురువారం దంపతులు బైకులో కదరమండలిగి దేవస్థానానికి వెళ్లారు. దేవుడి దర్శనం అనంతరం తిరిగి బైక్‌లో నూకాపురగ్రామం మీదుగా రాణిబెన్నూరు బయలుదేరారు. కదరమండలిగి క్రాస్‌ వద్ద  వెనుక నుంచి వాయువేగంతో వచ్చిన కారు, బైక్‌ను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement