సాక్షి, అమరావతి/ సాక్షి, తిరుపతి: త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మూడు జిల్లాల్లో సమర శంఖారావం సభలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి సమీపంలోని యోగానంద ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్లో మొదటి సభ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాలను ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో నిర్వహించాలని మొదట నిర్ణయించగా ప్రస్తుతం స్వల్ప మార్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు. తాజా మార్పు ప్రకారం ఫిబ్రవరి 6వ తేదీన తిరుపతి (చిత్తూరు జిల్లా), 7వ తేదీన వైఎస్సార్ జిల్లాలో, 8వ తేదీన అనంతపురం జిల్లాలో సభలు జరుగుతాయన్నారు.
వీటి తర్వాత రెండో విడత సభల వివరాలు ప్రకటిస్తామన్నారు. ఇలా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నిర్వహించనున్న ఈ సభల ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. సభ ప్రారంభానికి ముందే ఆయా జిల్లాల్లో కమిటీలు ఏవైనా పెండింగ్లో ఉంటే నియామకాలు పూర్తి చేయటంతో పాటు బూత్ కమిటీలు క్రియాశీలకంగా లేనిచోట్ల మార్పులు, చేర్పులు చేసుకుని అందరికీ సమాచారం అందించి సభకు హాజరయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభకు హాజరయ్యే బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. వారిని మాత్రమే ఈ సభకు అనుమతించనున్నట్లు వివరించారు.
సమర శంఖారావం సభకు స్థల పరిశీలన..
వచ్చేనెల 6న నిర్వహించనున్న సమర శంఖారావం సభ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నారాయణస్వామి, దేశాయ్తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సునీల్కుమార్ తదితరులు శనివారం యోగానంద ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ను పరిశీలించారు.
6న వైఎస్సార్సీపీ సమర శంఖారావం
Published Sun, Jan 27 2019 4:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement