నేడు తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌ గృహ ప్రవేశం  | Sakshi
Sakshi News home page

నేడు తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌ గృహ ప్రవేశం 

Published Wed, Feb 27 2019 3:39 AM

YS Jagan house warming ceremony in Tadepalli today - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి బుధవారం ఉదయం గృహప్రవేశం చేయనున్నారు. అనంతరం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. గృహ ప్రవేశం సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరుగుతాయని కార్యాలయ ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. బుధవారం ఉదయాన్నే వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడ్నుంచి నేరుగా తాడేపల్లి వెళ్తారు. కాగా, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ కార్యక్రమానికి ఉదయం పది గంటలకల్లా హాజరై, ఆతిథ్యం స్వీకరించాలని పార్టీ రాజకీయ కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి కోరారు.    

Advertisement
Advertisement