శ్రీకాకుళం :‘రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న యాదవులు అభివృద్ధికి నోచుకోవడం లేదు సార్’ అని నరసన్నపేట యాదవ సంఘ నాయకులు జగన్కు తెలిపా రు. రాజకీయపరంగా వెనుకబడి ఉన్నామని, తమ కులాన్ని బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చాలని కోరారు. పశువులు, గొర్రెలు మేపుకోవడానికి ప్రభుత్వ స్థలాలను మంజూరు చేయాలన్నారు. యాదవుల జీవాలకు ప్రభుత్వమే బీమా కట్టాలని కోరారు.
వడ్డీలు ఏవీ..?
‘అన్నా బ్యాంకుల్లో చెల్లిస్తున్న స్వయం శక్తి సంఘాల వడ్డీ నగదు అందడం లేదు’ నరసన్నపేటకు చెందిన టి.ఆదిలక్ష్మి జగన్ వద్ద ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా సంఘాలను ఆదుకోవాలని కోరారు.