సాక్షి ప్రతినిధి, ఏలూరు : దొంగతనం చేసిన ప్రబుద్ధులు పోలీసులకు అడ్డంగా దొరికిన తర్వాత.. మా మీద కేసుల్లేకుండా చూడండి.. మీకెంత కావాలో తీసుకోండి.. అని బంపర్ ఆఫర్ ఇచ్చిన వైనం.. అందుకు ఖాకీలు తలొగ్గిన నిర్వాకం ఏజెన్సీలో కలకలం రేపుతోంది. రెండురోజుల క్రితం చోటు చేసుకున్న ఈ వ్యవహారం పూర్వాపరాలిలా ఉన్నాయి.
జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో కుండలు, తినుబండారాలు విక్రయించుకునే ఓ మహిళ వద్దకు శుక్రవారం సాయంత్రం నాలుగుగంటల సమయంలో ఇద్దరు యువకులు వచ్చారు. మోటార్ సైకిల్పై వచ్చిన ఆ ఇద్దరిలో ఒక యువకుడు మట్టి కుండ కావాలని బేరమాడాడు. ఆమె కిందకు ఒంగి మట్టి కుండలు చూపిస్తుండగా.. మెడలోని బంగారు నానుతాడును తెంపుకుని.. బండి స్టార్ట్ చేసి రెడీగా ఉన్న యువకుడితో కలిసి పరారయ్యాడు. ఆ మహిళ వేసిన కేకలతో పక్కనే ఉన్న ఆమె కుమారుడు, బంధువులు ఆ యువకులను వెంబడించాడు.
ఆ యువకులు అప్పలరాజుగూడెం మీదుగా టి.నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెం వెళ్లి అక్కడ కోడిపందేలు జరుగుతుంటే ఆ జనంలో కలిసిపోయారు. అయినాసరే గుర్తుపట్టిన ఆమె కుమారుడు, బంధువులు వారిని పట్టుకున్నాడు. ఈలోగా మహిళ ఇచ్చిన సమాచారంతో జీలుగుమిల్లి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తొలుత వారిద్దరూ తమకేం సంబంధం లేదని బుకాయించినా.. ఆ మహిళను అక్కడకు తీసుకొచ్చి వారిని చూపించడంతో ఆమె గుర్తుపట్టి వీళ్లే తన గొలుసు తెంచుకెళ్లారని స్పష్టం చేసింది. ఇంతలో టి.నరసాపురం పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు.
పెద్దల పంచాయితీ
సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఆ యువకులకు మద్దతుగా ఊరి పెద్దలు రంగప్రవేశం చేశారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఆ గొలుసుతో పాటు రూ.40వేలు ఆ అమ్మాయికి ఇప్పిస్తాం.. మీరు ఓ రూ.లక్షన్నర పుచ్చుకోండి.. అని పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతే..మారుమాట్లాడకుండా పోలీసులు ఆ సొమ్మును పుచ్చుకుని కేసుల్లేకుండా తిరిగి వెళ్లిపోయారు. ఇక్కడ దొంగలు దొరికారు కాబట్టి ఆ మహిళకు న్యాయం జరిగింది.. కానీ దొరక్కపోతే పరిస్థితేమిటి.. దొరికిన దొంగలంతా.. ఇదే మాదిరి పంచాయితీలు చేయిస్తూ పోతే అసలు పోలీసుల వల్ల ఉపయోగమేమిటి అన్నవే ఈ వ్యవహారంతో ఉత్పన్నమైన ప్రశ్నలు.
గొలుసు దొంగలతో.. ఖాకీల లాలూఛీ
Published Mon, Jan 11 2016 12:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement