కొనుగోల్మాల్!
గజ్వేల్,:
ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. నవంబర్ నెల మూడో వారంలో వారం రోజుల పాటు తుపాన్ ధాటికి ఈ పంటకు అపార నష్టం వాటిల్లింది. నష్టాన్ని మినహాయిస్తే జిల్లావ్యాప్తంగా రైతులవద్ద సుమారు 60 లక్షల క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న ఉత్పత్తులు వచ్చాయి. గజ్వేల్ ప్రాంతంలో నూర్పిళ్లు జరగకుండా మొక్కజొన్న జూళ్లు చేలల్లోనే వున్నాయి. ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా అక్టోబర్ నెలలో జిల్లాలో 14 ఐకేపీ కేంద్రాలను తెరిచింది. ఈ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.1,310 చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఐకేపీ కేంద్రాల ద్వారా సుమారు 5లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. నిజానికి రైతులు పండించిన ఉత్పత్తుల్లో ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసింది 10 శాతం కూడా మించలేదంటే అతిశయోక్తి కాదు. గజ్వేల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 28 వేల కింటాళ్లకుపైగా మక్కలను కొనుగోలు చేశారు. ఇందులో 14 వేల క్వింటాళ్లకుగాపైగా నిల్వలను మార్క్ఫెడ్ గోదాముల్లోకి తరలించి సుమారు రూ.1.85 కోట్ల చెల్లింపులు జరిపారు. మరో 14 వేల క్వింటాళ్ల నిల్వలు ప్రస్తుతం యార్డులో తరలింపునకు నోచుకోకుండా ఉన్నాయి. వీటిని 50 రోజుల క్రితమే కొనుగోలు చేశారు.
కొనుగోల్మాల్!
Published Mon, Feb 17 2014 12:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
11న ప్రియాంకా గాంధీ సభ
పరిస్థితి విషమించి యువకుడు..
అవినీతి ‘కాలువ’
తప్పక చదవండి
Advertisement