నాయనా..నువ్వే గెలవాలి | Sakshi
Sakshi News home page

నాయనా..నువ్వే గెలవాలి

Published Fri, Nov 24 2017 6:32 AM

Oldwomen sharing her Sorrows To ys jagan - Sakshi

ఆత్మకూరు: ‘నాయనా.. నా పేరు ఎల్లమ్మ.. 80 ఏళ్లు నాకు. ఏమి గవర్నమెంటోళ్లు నాయనా.. వేలిముద్ర పడడం లేదని నాకొచ్చే పది కేజీల బియ్యం కూడా ఇవ్వడం లేదు’ అని వెల్దుర్తి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు చేతిలో కర్రపట్టుకుని వణుకుతూ వచ్చి జగనన్నను పట్టుకుని విలపించింది. ఎంతో అభిమానంతో వచ్చిన అవ్వ బాధ విన్న వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. అవ్వా ఎందుకు ఇవ్వడం లేదని అడగగా వేలి ముద్రలు పడలేదని ఇవ్వడం లేదని చెప్పింది. అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎల్లమ్మవ్వకు వేలు పడడం లేదంటూ వచ్చే రేషన్‌ బియ్యాన్ని కూడా ఇవ్వకుండా నిలిపివేసింది.

ఎంత దారుణమో చూడండి అన్నారు. అవ్వా త్వరలోనే మన కష్టాలన్నీ తీరుతాయని వైఎస్‌ జగన్‌ చెప్పడంతో ‘నాయనా.. నువ్వే గెలవాలి.. మా ముసలోల్ల కష్టాలన్నీ తీర్చాలి’ అని వృద్ధురాలు జననేతను కోరింది. ‘దేవుని దీవెనలు.. మీ అందరి ఆశీస్సులతో ప్రభుత్వం రావాలని దేవున్ని వేడుకో అవ్వా’ అంటూ ఆప్యాయంగా ఆ వృద్ధురాలికి భరోసా కల్పించారు.

Advertisement
Advertisement