- తండ్రి వర్ధంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రతిపక్షనేత
- ఇడుపులపాయలో చురుగ్గా ఏర్పాట్లు భారీ రక్తదాన శిబిరం
- కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వెల్లడి
సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం ఉదయం ఇడుపులపాయకు రానున్నారు. ఈమేరకు పర్యటన ఖరారైందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. ఈనెల 2న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ జగన్ మోహన్రెడ్డి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున ఎర్రగుంట్లకు చేరుకుంటారన్నారు.
అనంతరం అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారని చెప్పారు. మంగళవారం ఉదయం తండ్రి సమాధి వద్దకు వెళ్లి వైఎస్ జగన్ నివాళులు అర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని స్పష్టంచేశారు. తండ్రి వర్ధంతి వేడుకల కార్యక్రమాలు ముగించుకొని సమయాన్ని బట్టి మధ్యాహ్నం నుంచి పులివెందులకు వెళ్లే అవకాశముంటుందన్నారు. ఇంకా దీనిపై స్పష్టత రావాల్సి ఉందని ఆయన తెలిపారు. మంగళవారం ఒక్కరోజు పర్యటన ముగించుకొని రాత్రికి మళ్లీ హైదరాబాద్ బయలుదేరి వెళతారని ఆయన వివరించారు.
ఇడుపులపాయలో ఏర్పాట్లు :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలిరానున్నారు. జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరానున్న నేపథ్యంలో ఇడుపులపాయలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్ మంగళవారం ఇడుపులపాయలో ఉండనున్న నేపథ్యంలో ఆయనను ప్రజలు కలిసేలా కూడా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీఛెర్మైన్లు, మున్సిపల్ ఛెర్మైన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు భారీగా తరలిరానున్నారు.
ఇడుపులపాయలో భారీ రక్తదాన శిబిరం :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలో భారీ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ అభిమానులతోపాటు కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాలుపంచుకోవాలని పార్టీ వర్గాలు పిలుపునిచ్చాయి. అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు.
రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్
Published Mon, Sep 1 2014 4:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement