ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సంకల్ప యాత్ర ముందుకు సాగింది. బుధవారం 188వ రోజు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట అశేష ప్రజానీకం అడుగులో అడుగేసి సంఘీభావం తెలిపింది. ఊరూరా ప్రజలు ఘన స్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని మంగళవారం రాజమహేంద్రవరంలో అడుగుపెట్టిన జననేతకు అపూర్వ రీతిలో ప్రజలు ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. జన ఉప్పెన ఎగిసి పడిందా.. అన్న రీతిలో ప్రజలు గోదావరి వంతెన ఆ చివర నుంచి ఈ చివర వరకు పోటెత్తడంపై ఊరూరా చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో రెండవ రోజు పాదయాత్రలో సైతం ప్రతి చోటా జనంలో అదే ఉత్సాహం, ఆనందం కనిపించింది. జగనన్న తమ వద్దకే పాదయాత్రగా వస్తున్నారని తెలుసుకున్న జనం గంటల తరబడి ఆసక్తిగా ఎదురు చూశారు. రాజమహేంద్రవరంలో రాత్రి బస చేసిన ఐఎల్టీడీ జంక్షన్ వద్ద గ్లోరిడై చర్చి ప్రాంతం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. అల్కాట్ తోట, రూరల్ ప్రాంతమైన శంభునగర్, లక్ష్మీనరసింహనగర్ మీదుగా సాగింది. అడుగడుగునా పెద్ద సంఖ్యలో మహిళలు జననేతతో మాట్లాడాలని వేచి ఉండటంతో యాత్ర ఆలస్యంగా సాగింది. ప్రతి సెంటర్లోనూ యువకులు ద్విచక్ర వాహనాలపై పార్టీ జెండాలు చేతబూని సందడి చేశారు. జై జగన్.. అని నినాదాలు చేస్తూ దారి పొడవునా హోరెత్తించారు.
మహిళలు, విద్యార్థినులు సెల్ఫీలు తీసుకోవడానికి, కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. దీంతో ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన భోజన బస వద్దకు రెండు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. కాసేపటి తర్వాత అర్థర్ కాటన్ బ్యారేజిపై నుంచి నడక సాగిస్తున్నప్పుడు అశేష ప్రజానీకం జగన్ను అనుసరించింది. మరో వైపు బ్యారేజీపై కూడా జనం ఎదురొచ్చి తమ సమస్యలను జగన్కు చెప్పుకున్నారు. స్థానిక ప్రజలు బ్యారేజీకి ఇరువైపులా గెలలతో కూడిన అరటి చెట్లను అలంకరించి (ఈ ప్రాంతంలో అరటి సాగు ఎక్కువ) స్వాగతం పలకడం వారి అభిమానానికి నిదర్శనంగా నిలిచింది. కాటన్ బ్యారేజి మీద పిచ్చుక లంక దాటుకుంటూ బొబ్బర్లంక గ్రామంలోకి జగన్ ప్రవేశిస్తున్నపుడు భారీ ఎత్తున జనం ఎదురేగి ఆయనకు స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుమ్మడికాయలతో హారతి పట్టారు.
కష్టాలు ఏకరువు పెట్టిన ప్రజలు
బొబ్బర్లంక గ్రామం కుడి వైపున గల పంట కాలువలో నవరత్నాల పథకాలను చిత్రీకరించిన కటౌట్లను పడవలపై ఆకర్షణీయంగా అలంకరించడం ఆకట్టుకుంది. బొబ్బర్లంక దాటి పేరవరంలో రాత్రి బసకు చేరుకునేంత వరకూ జనం ఓ వైపు స్వాగతం పలుకుతూనే మరో వైపు కష్టాలు చెప్పుకున్నారు. డ్రెయిన్ నిర్మాణానికి అడ్డంగా ఉన్నాయని కాలువ గట్టుపై ఉన్న ఇళ్లను తొలగిస్తామంటున్నారని, ఇలాగైతే 40 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమ పరిస్థితి ఏమిటని ధవళేశ్వరానికి చెందిన చిట్టూరు అనంతలక్ష్మి జననేత ఎదుట కన్నీటి పర్యంతమైంది. ‘కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఖర్చు చేసి డాబా కట్టుకున్నాం.
మాలాగే 250 మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మా అత్త, మామల ఊరు కూడా ఇదే. మేం ఎక్కడికి పోవాలి? డ్రెయిన్ నిర్మాణాన్ని మరో మార్గంలో చేపట్టేలా చూడండి’ అని ఆమె విన్నవించింది. వినికిడి, మూగ సమస్యతో బాధ పడుతున్న తన కుమారుడు శ్రీరాంగౌడ్కు సదరమ్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ ఇవ్వడం లేదని ఇదే గ్రామానికి చెందిన మారిశెట్టి అనూరాధ తన గోడు వెళ్లబోసుకుంది. జన్మభూమి కమిటీ వారికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని వాపోయింది. ‘నాలుగేళ్లుగా అన్నీ కష్టాలేనన్నా.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నా.. మోసపోయామన్నా.. ఇక మీ వెంటే నడుస్తామన్నా’ అని పలువురు జననేతతో అన్నారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
జన హోరు.. సంకల్పానికి జేజేలు
Published Thu, Jun 14 2018 2:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement