నేటి నుంచి 5 స్లాట్లలో బుకింగ్ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి 5 స్లాట్లలో బుకింగ్

Published Wed, Dec 3 2014 7:21 AM

five slats booking to be started from today for Srivari special visit

శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కేటాయింపులో మార్పులు
 తిరుపతి: టీటీడీ సౌజన్యంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో  తపాలా శాఖ విక్రయిస్తున్న శ్రీవారి ప్రత్యేక దర్శనం  టికెట్ల బుకింగ్ టైం స్లాట్లలో మార్పులు చేసినట్లు తిరుపతి తపాలా డివిజన్ సూపరింటెండెంట్ టీఏవీ.శర్మ తెలిపారు. ఇది వరకు అమలులో ఉన్నట్లు రెండు స్లాట్లలో కాకుండా డిసెంబర్ 3వ తేదీ నుంచి 5 స్లాట్లలో టికెట్లు బుక్ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు టికెట్లను ఒక రోజు ముందు బుక్ చేసుకోవాలన్నారు.
 
  లేదా, రెండు వారాల వరకు చెల్లుబాటులో ఉండే టికెట్‌ను ఏ తేదీ దర్శనం కావాలని అనుకుంటే ఆ తేదీకి బుక్ చేసుకోవచ్చన్నారు. ఈనెల 3వ తేదీ నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందన్నారు. రోజులో ఉదయం 11 గంటలకు ప్రారంభించి గంటకు 200 టికెట్ల వంతున మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 1,000 టికెట్లు విక్రయించనున్నట్లు శర్మ తెలిపారు. డిసెంబర్ 15 నుంచి తపాలా శాఖ ద్వారా విక్రయించే టికెట్ల సంఖ్యను1200కు పెంచి అదనంగా మరో స్లాట్ అమలు చేస్తామని శర్మ తెలిపారు.

Advertisement
Advertisement