సీఎం చంద్రబాబు, వెంకయ్యలపై ఫిర్యాదులు | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు, వెంకయ్యలపై ఫిర్యాదులు

Published Mon, Sep 7 2015 10:10 PM

సీఎం చంద్రబాబు, వెంకయ్యలపై ఫిర్యాదులు - Sakshi

చిత్తూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల వాగ్దానాలను, హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సోమవారం 14 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

 

మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాజహాన్ బాషా మూడు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సత్యవేడు నియోజకవర్గంలో 7 స్టేషన్లలో, తంబళ్లపల్లె నియోజకవర్గంలో మూడు స్టేషన్లలో తిరుపతిలో ఒక చోట ఫిర్యాదు చేశారు.

 

 

 

 

Advertisement
Advertisement