-
నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ బుధవారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన మధ్యాహ్నం 1:50 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.55 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.45 గంటలకు రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్న కలికిరిలో బహిరంగ సభలో పాల్గొంటారు.సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకుంటారు. అక్కడ బందర్ రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద 7 గంటలకు రోడ్ షోను ప్రారంభించి, గంట పాటు బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఆ అవినీతిపరుడే గొప్పవాడయ్యారా?: సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని స్వయంగా ప్రధాని మోదీ గత ఎన్నికల్లో ఆరోపించారు. మరిప్పుడు చంద్రబాబు ఎలా మంచోడయ్యాడో అర్థం కావట్లేదు. ప్రధాని మోదీ మాటలు వింటుంటే రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా? అని బాధగా ఉంది. తిట్టిన వారి చంకనెక్కే విద్యలో చంద్రబాబు నిపుణుడు. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆగింది.గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే.. ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవరూ ఆపడం సాధ్యం కాదు. ఎందుకంటే?.. వాళ్లు దీన్నే ఎన్నికల రిఫరెండంగా తీసుకుంటారు! స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలంతా మద్దతు తెలిపారు కాబట్టే టీడీపీ అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడని చెబుతారు! ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా.చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలసి ఆడుతున్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి? అని అడుగుతున్నా. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా? పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయబోమని జట్టు కట్టారా?’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశి్నంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. అవినీతిపరుడని అన్న నోటితోనే.. విచిత్రం ఏమిటంటే.. మనం ఇంతగా అభివృద్ధి బాటలో కనిపిస్తుంటే నిన్న సభలో ప్రధాని మోదీ గారు చేసిన విమర్శలు చూస్తుంటే గత ఎన్నికల్లో చంద్రబాబు గురించి ఆయన ఏమన్నారో గుర్తు తెచ్చుకోమని కోరుతున్నా. పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు గురించి చెప్పలేదా? చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇవాళ ఇదే మోదీగారు మళ్లీ ఇవాళ బాబు తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడంటున్నారు. అంటే.. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించాలని కోరుతున్నా. వారితో ఉంటే ఒకలా.. లేదంటే మరోలా మాటలు మారుస్తున్నారంటే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించాలి. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి? అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఏమైనా ఇస్తామని జట్టు కట్టారా? పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయబోమని జట్టు కట్టారా? జగన్ ఆమోదం లేదు కాబట్టే ఆగింది.. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేసింది. ఐదేళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదంటే దానికి కారణం జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టే! ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలని కోరుతున్నా. స్టీల్ ప్లాంట్ విక్రయాన్ని ఆపేలా ఈ ఎన్నికల్లో ఆ బాబు, దత్తపుత్రుడు, బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడ నుంచి పంపాలని కోరుతున్నా.గాజువాకలో టీడీపీకి ఓటు.. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఓటేసినట్టే గాజువాకలో మీరు టీడీపీకి ఓటు వేయడం అంటే దాని అర్థం.. ప్రైవేటైజేషన్ చేస్తామని అంటున్న ఎన్డీఏకి ఓటు వేయడమే. అంటే.. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్లు అవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతున్నా.గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే, ఎన్డీఏ గెలిచిందంటే.. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడం సాధ్యం కాదు. దీన్ని రిఫరెండంగా తీసుకుంటారు. ఆ తర్వాత దీన్ని ఆపడానికి జగన్ ఎంత ప్రయత్నం చేసినా ‘‘నీకెందుకయ్యా బాధ? వాళ్లకు లేని బాధ నీకెందుకు? ఎన్డీఏకి ఓటు వేశారంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వారంతా గ్రీ¯న్ సిగ్నల్ ఇచి్చనట్లే కదయ్యా..! మరి నీకెందుకయ్యా బాధ?’’ అని అంటారని గుర్తు పెట్టుకోండి.రెండు బిల్డింగ్లు కడితే రైల్వే జోన్ కాదు.. రైల్వే జోన్కు మనం భూములు ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటిగేషన్ పెడుతున్నారు. రైల్వే జోన్కు అర్థం.. ఆరి్థకంగా నిలబడగలిగిన జోన్ అని. కేవలం రెండు బిల్డింగులు కట్టి మమ.. అనిపించడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఇవాళ వీళ్లు మనమీద చూపిస్తున్నదని దొంగ ప్రేమేనని గమనించాలని కోరుతున్నా. తిట్టిన వారి చంకనెక్కడం లాంటి విద్యల్లో చంద్రబాబు నిపుణుడు. -
ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు
సాక్షి, విశాఖపట్నం: దేశంలో బీజేపీదే అతి పెద్ద అవినీతి చరిత్ర అని, ఆ పార్టీ చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చెయ్యలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. బొత్స మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోదీకి తోడు దొంగ అయిన చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే సోమవారం సభల్లో చదివారని చెప్పారు. తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆది చదివేయడమేనా, నిజాలు పరిశీలించొద్దా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. మోదీ అదే నోటితో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని చెప్పిన విషయాన్ని మర్చిపోయారా! అని అన్నారు. ప్రధాన మంత్రి మాటలంటే వాటికి పవిత్రత ఉండాలని చెప్పారు. ఇంతలా దిగజారిపోయి మాట్లాడే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. పోలవరంపై విచారణ చేసుకోండి పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపించుకోవచ్చు కదా అని అన్నారు. రూ.15 వేల కోట్లకు ఈసీలు ఇవ్వకుండానే ప్రధాని నిధులు విడుదల చేశారా అని ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత నిరాధారపూరితంగా మాట్లాడకూడదని చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కేంద్రం సహకారం ఉంటే తప్పకుండా పూర్తవుతుందన్నారు. చంద్రబాబు హయాంలో పునరావాసం సొమ్మును ఫ్రీజ్ చేశారని షెకావత్ చెప్పారన్నారు. అప్పట్లో చూపిన లబ్దిదారులు సరైనవాళ్లు కాదని వాస్తవ లబ్దిదారులు ఆరోపిస్తున్నారని అన్నారు. నిర్వాసితులకు డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్నారు. చంద్రబాబు తప్పులను కూడా తాము సరిచేస్తున్నామని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచి కార్యక్రమమని బీజేపీ వాళ్లు చెప్తుంటే.. చంద్రబాబు, పవన్ మాత్రం ప్రజల్ని మోసం చేసేలా మాట్లాడుతున్నారన్నారు. వాళ్లిద్దరికీ సుద్దులు చెప్పాల్సిన మోదీ.. తమకు చెప్తున్నారని మండిపడ్డారు.నీచంగా మానవత్వం లేకుండా కూటమి చర్యలుటీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పథకాలకు మోకాలడ్డుతూ నీచంగా, మానవత్వం లేకుండా పేదల కడుపు కొడుతున్నాయని బొత్స ధ్వజమెత్తారు. వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని అడ్డుకొని, రెండు నెలల్లో 40 మంది అవ్వా తాతలను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. సుమారు 79 లక్షల మంది లబ్దిదారులున్న వైఎస్సార్ ఆసరా పథకంలో చివరి విడతలో ఇంకా రూ.1,839 కోట్లు చెల్లించకుండా అడ్డుకొన్నారని చెప్పారు. విద్యాదీవెన పథకంలో కూడా 28 లక్షల మంది లబి్ధదారులకు రూ.703 కోట్లు ఇవ్వకుండా అడ్డుపడ్డారన్నారు. తుపాను, కరవు వల్ల నష్టపోయిన 13.60 లక్షల మంది రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ రూ.1,294.58 కోట్లు బ్యాంకుల్లో ఉన్నా లబ్ధిదారుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకున్నారన్నారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత కింద 33 లక్షల మందికి రూ.565 కోట్లు విడుదల చేయడానికీ ఒప్పుకోలేదన్నారు. ఈబీసీ నేస్తం కింద 4.20 లక్షల మందికి రూ.629 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇవన్నీ అమలులో ఉన్న పథకాలే అని, సాధారణంగా జరగాల్సినవేనని, అందుకే ఎన్నికల సంఘాన్ని గత నెలలోనే అనుమతి కోరామని, అయినా అనుమతివ్వలేదని చెప్పారు. 2019లో పసుపు కుంకుమ కార్యక్రమం ఎన్నికల నోటిఫికేషన్ తరవాత ఇచ్చారని, తాము దానికి అడ్డుపడ్డామా అని ప్రశ్నించారు. దీనికి తోడు సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు కారు కూతలు కూస్తున్నారని, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడవచ్చా! అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందన్నారు. తమకూ అలాంటి మాటలు వచ్చని, అయితే తమకు సభ్యత సంస్కారం ఉన్నాయని చెప్పారు. ప్రజలు 15 రోజులు ఓపిక పడితే మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఏ కూటమి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదని అన్నారు.ఈసీ వాస్తవాలు పరిశీలించాలి.. కూటమికి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతూ ఏ ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించడం సరికాదని అన్నారు. ఎన్నికల నిబంధనలకు, రాజ్యాంగానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఈసీ విజ్ఞతతో వాస్తవాలు పరిశీలించాలని కోరారు. కూటమి ఫిర్యాదు వల్ల వ్యక్తులకు, వ్యవస్థకు నష్టమా అనేది ఆలోచించకుండా వృద్ధుల చావుకు కారణం అవ్వడం భావ్యమా అని అన్నారు. చంద్రబాబు నీచమైన భాషపై ఈసీ తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. వృద్ధుల చావులకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులకు జరిగే నష్టానికి, ఫీజులందక విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకపోవడం, టీసీలు ఇవ్వకపోవడం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీ కార్యక్రమాలకు ఈసీ ఓకే చెప్పిందన్నారు. అందుకే నిన్న సీఎం వైఎస్ జగన్ సజావుగా ఎన్నికలు జరుగుతాయా! అన్న అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు. -
జగన్ది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో
నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో అని, చంద్రబాబుది అధికార దాహం తీర్చుకునే మోసపూరిత మేనిఫెస్టో అని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు అమలు కాని హామీలు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తాను చాలామంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ చెప్పింది చెప్పినట్టు చేసి చూపించి.. ప్రజల కోసం పాటుపడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. పేదవాడి చేతి ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లాలని కోరుకుని ఆ దిశగా తన ఐదేళ్ల పాలన కొనసాగించిన నేత జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. అలా మంచి చేసే ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి దిగజారాడు చంద్రబాబు అధికారం కోసం కులాల మధ్య చిచ్చుపెట్టే స్థాయి నుంచి చివరకు కుటుంబాల మధ్య కూడా చిచ్చుపెట్టే స్థాయికి దిగజారిపోయారని ముద్రగడ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారని, ఇప్పుడు తన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నీచ రాజకీయాలపై చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాలని తపిస్తున్న సినీ నటుడు పవన్కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలన్నారు. తుని ఘటన తరువాత చంద్రబాబు తనను వేధించిన తీరు, అవమానాలు మర్చిపోలేకపోతున్నానని ఆయన వాపోయారు. మళ్లీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సభకు మాజీ జెడ్పీటీసీ, కాపు నేత చాగంటి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. నరసాపురం వైఎస్సార్సీపీ అ«భ్యరి్థ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
ఓటు అనే ఆయుధంతో ఢిల్లీ పీఠం కదలాలివీళ్లు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడు అంతా గమనిస్తున్నాడు. మీ బిడ్డకు ప్రజల దీవెనలున్నాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నల చేతుల్లో ఓటు అనే బలమైన ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో వీళ్లను కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుందని గట్టిగా చెబుతున్నా.విశాఖలోనే ప్రమాణ స్వీకారం..జూన్ 4 తర్వాత మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదే రోజు పరిపాలనా రాజధానిగా విశాఖ నుంచే పాలన చేయబోతున్నానని గర్వంగా చెబుతున్నా. మూడు రాజధానుల్లో విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నాం. మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తూ మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలతో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలన చేరువ చేశాం. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వస్తోంది. రూ.4,400 కోట్లతో మూలపేట పోర్టు పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను శరవేగంగా చేస్తున్నాం, విశాఖ–భోగాపురం 6 లేన్ల రహదారిని నిర్మిస్తున్నాం. విశాఖలో అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైంది కూడా మీ బిడ్డ పాలనలోనే.– ఇచ్ఛాపురం సభలో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: ‘దేవుడి దీవెనలు, మీ ఆశీస్సులున్నంత వరకూ మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. జూన్ 4న మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది. మనం నొక్కిన బటన్లు అన్నీ వారం రోజుల్లోనే క్లియర్ చేస్తాం. ఢిల్లీతో కలిసి మీ బిడ్డ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు సీఎంగా చేశానంటాడు. అన్నేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా? జగన్ అంటే పథకాలు.. చంద్రబాబు అంటే మోసాలు, కుట్రలు, కుతంత్రాలే గుర్తుకొస్తాయి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలు, కుతంత్రాలకు ఓటు అనే వజ్రాయుధంతో మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంతలా దిగజారిపోయారు..కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కచెల్లెమ్మలకు అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. సాక్షాత్తూ మీ జగన్ ఓ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేసే పరిస్థితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే వీళ్లను ఏమనాలి? మీ జగన్ బటన్ నొక్కిన పథకాలన్నీ ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా తెచ్చినవి కాదు. గత ఐదేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా ఇస్తున్న పథకాలకే మీ జగన్ బటన్ నొక్కాడు. ఈ స్కీములు ఇవాళ ఏదో కొత్తగా తెచ్చినవి కాదు. ఇవన్నీ ఆన్ గోయింగ్ స్కీమ్స్. బడ్జెట్ కేటాయింపులున్నవే. అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవే. 58 నెలలుగా ఇస్తున్న పథకాలకు అడ్డుపడుతూ జగన్ను కట్టడి చేసేందుకు ఢిల్లీతో కలసి కుట్రలు పన్నుతున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందకుండా అడ్డు తగిలే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వీళ్లు దిగజారిపోయారు. గత ఐదేళ్లుగా క్యాలండర్లో చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇస్తూ పోతున్న మీ జగన్ను ఇబ్బంది పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారు. చివరిలో అడ్డుపడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా? పెన్షన్ సొమ్ము ఇన్నేళ్ల పాటు మీ బిడ్డ ఇంటికే పంపించిన తర్వాత చివరి రెండు నెలలు ఆ డబ్బులు ఇంటికి రాకపోతే ఏం జరిగిందో ఆ అవ్వాతాతలు గ్రహించలేరనుకున్నారా? ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నా. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వారం రోజుల్లోనే ఈ బటన్లు అన్నీ మీ బిడ్డ క్లియర్ చేస్తాడు. బాబు ఒక్క బటనూ నొక్కలేదు..మనపై ఇన్ని కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీ జగన్ మాదిరిగా ఎన్నడూ బటన్లు నొక్కలేదు. ఏ రోజూ ఏ ఒక్క అక్కచెల్లెమ్మకూ డబ్బులు, పథకాలు ఇవ్వలేదు. మీ బిడ్డ జగన్ ఈ 59 నెలల కాలంలో 130 సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ముతో లోబర్చుకునేందుకు ఎన్నికల రోజు రూ.2 వేలు, రూ.3 వేలు, కొన్ని చోట్ల రూ.4 వేలు, రూ.5 వేలు కూడా ఇస్తాడు. చంద్రబాబు ఎన్నికల రోజు ఇచ్చే ఆ డబ్బంతా మనదే. మన దగ్గర దోచేసిన డబ్బే అది. కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరూ వద్దు అనొద్దు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీకు, మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ అభివృద్ధి, పథకాలను కొనసాగిద్దాం..మరో ఆరు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపటమే. రాష్ట్రంలో గతంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. గడప గడపకూ మేనిఫెస్టోతో వెళ్లి మరోసారి ఆశీర్వదించాలని కోరాం. మన పథకాలు.. మచ్చుకు కొన్ని‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాస్ రూముల్లో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో బైలింగ్యువల్ టెక్టŠస్ బుక్స్ (ద్విభాషా పాఠ్య పుస్తకాలు), బడులు తెరవగానే పిల్లలకు విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం, తప్పనిసరి ఇంటర్న్షిప్... ఇలాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? మహిళా సాధికారత.. వినూత్న వ్యవస్థలుఅక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల గృహ నిర్మాణాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, రేషన్, పథకాలు.. ఇలా నేరుగా డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకేలు, సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు గతంలో ఉన్నాయా?స్వయం ఉపాధికి అండగా..వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలతో స్వయం ఉపాధికి అండగా నిలిచిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? రూ.25 లక్షల వరకూ విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, జీవన భృతి అందిస్తూ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయం, ఫైబర్గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం గ్రామంలోనే మహిళా పోలీసు, దిశా యాప్ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా చూశారా? నాడూ నేడూ అదే రాష్ట్రం.. అదే బడ్జెట్. చంద్రబాబు ఏ రోజూ పేదల కోసం బటన్లు నొక్కలేదు. అప్పుల గ్రోత్ రేట్ కూడా గతంలో కంటే ఇప్పుడే తక్కువ. ఇది కాదా అభివృద్ధి..?మీ జగన్ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే ఏ స్కీమూ గుర్తు రాదు కాబట్టి జగన్ హయాంలో అభివృద్ధి లేదంటూ అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32,000 కోట్లు అయితే మీ బిడ్డ జగన్ పాలనలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయంటే అంటే ఇది అభివృద్ధి పాలన కాదా? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ మీ బిడ్డ హయాంలోనే వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీని వరుసగా ఏటా నంబర్ వన్గా నిలబెట్టాం. కొత్తగా 4 సీ పోర్టులు నిర్మిస్తున్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చాం. 15,000 గ్రామ సచివాలయాలు, 11,000 విలేజ్, వార్డు క్లినిక్లు, 11,000 ఆర్బీకేలు నెలకొల్పాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 3.95% మాత్రమే ఉంది. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల మందికిపైగా సిబ్బందిని నియమించాం. మీ బిడ్డ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 కాగా కొత్తగా మరో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వమే.మన అభ్యర్థులను దీవించండి..నాకు సొంత తమ్ముడు లేడనే బాధ ఉండేది. రాజాను (రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా) చూశాక ఆ బాధ పోయింది. నా తమ్ముడిని గొప్ప మెజార్టీతో గెలిపించాలి. మీరు రాజాకు ఓటేస్తే గణేష్, అమ్మ (జక్కంపూడి విజయలక్ష్మి), రాజా భార్య అంతా కలిసి మీ మంచి కోసం ఇంకా ఎక్కువగా కృషి చేస్తారు. మంచి వైద్యుడిగా పేరున్న శ్రీను అన్న (రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్)ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించండి. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి విజయమ్మ, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను దీవించాలని కోరుతున్నా. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, నాకు అక్క లాంటి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని భారీ మెజార్టీతో గెలిపించండి.మీ కుటుంబంతో చర్చించండి..ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. అది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపున నిలిచి ఈ యుద్ధం జరుగుతోంది. మీరంతా ఓటేసేముందు మీ కుటుంబంతో కలసి కూర్చొని చర్చించండి. చిన్న పిల్లల అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. ఏ ప్రభుత్వం వల్ల, ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో గమనించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. మంచి చేసే ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసే సైకిల్ ఎక్కడ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయం, హాస్పిటళ్లు మెరుగ్గా ఉండాలన్నా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలి.ఉద్దానం కిడ్నీ కష్టాలకు విముక్తిదశాబ్దాలుగా ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం రూ.780 కోట్లతో హిరమండలం నుంచి తాగునీటిని తరలించింది మీ బిడ్డ ప్రభుత్వమే. రూ.80 కోట్లతో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ను నిర్మించింది మన ప్రభుత్వమే. ఉత్తరాంధ్రలో కొత్తగా మెడికల్ కళాశాలలు కడుతున్నాం. పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇవి ఏర్పాటవుతున్నాయి. సాలూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నది మన ప్రభుత్వమే. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల కడుతున్నది మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయంటే కారణం మీ బిడ్డే. సెల్ఫోన్ కనెక్టివిటీ లేని గిరిజన ప్రాంతాల్లో రూ.400 కోట్ల వ్యయంతో టవర్లను ఏర్పాటు చేశాం. 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3,23,000 ఎకరాల పట్టాలిచ్చి వారికి రైతు భరోసా అందిస్తూ జీవనోపాధి చూపించింది కూడా మీ బిడ్డే.కోరుకొండ భూముల సమస్య పరిష్కరిస్తా..కోరుకొండ భూముల గురించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుర్తుచేశాడు. ఫైల్ ప్రాసెస్లో ఉన్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూముల సమస్యను పరిష్కరిస్తామని సవినయంగా తెలియజేస్తున్నా.తుప్పు సైకిల్.. ఢిల్లీ మెకానిక్స్!ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు గుప్పించే చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టానికి ప్రతీకారంగా రైతన్నలు, నిరుద్యోగులు, అక్కచెల్లెమ్మలు, వివిధ సామాజిక వర్గాలు, పల్లెలు, పట్టణాల వాసులు అంతా కలసి సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు రిపేరు చేయాలని చంద్రబాబు తంటాలు పడుతున్నాడు. ముందుగా ఎర్రచొక్కాల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఫలితం లేకపోవడంతో దత్తపుత్రుడి దగ్గరకు వెళ్లాడు. తుప్పు పట్టిన సైకిల్ కేరియర్ మీద మాత్రమే కూర్చుంటా! టీ గ్లాస్ పట్టుకుని తాగుతా! మిగిలింది నావల్ల కాదని దత్తపుత్రుడు చెప్పాడు. దీంతో వదినమ్మను ఢిల్లీకి పంపాడు. అక్కడి మెకానిక్స్ను ఇక్కడికి దింపి సైకిల్ను ఓ షేపులోకి తేవాలని కోరాడు. ఆ ఢిల్లీ మెకానిక్స్ ఇక్కడికి వచ్చి తుప్పు పట్టిన సైకిల్ను చూసి... హ్యాండిల్ లేదు! సీటు లేదు! పెడల్స్ లేవు! చక్రాలు, ట్యూబులు లేవు! మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు! ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తాం చంద్రబాబూ! అని అడిగితే పిచ్చి చూపులు చూస్తూ.. ఇదొక్కటే మిగిలిందంటూ ట్రింగ్ ట్రింగ్మని బెల్లు మోగిస్తున్నాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో!2014లో బాబు ముఖ్యమైన మోసాలు..⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? ⇒ డ్వాక్రా సంఘాలకు రూ.14,205 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని రూపాయైనా మాఫీ చేశాడా?⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి స్కీమ్ కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. మరి ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇచ్చాడా?⇒ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా?⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్ను మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? ⇒ రాజానగరంలో ఎవరికైనా కనిపిస్తోందా? ⇒ ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. ⇒ అదే ముగ్గురు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ నమ్మబలుకుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
తప్పక చదవండి
Advertisement