-
సజావుగా పోస్టల్ బ్యాలెట్
కడప సెవెన్రోడ్స్: సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసు పర్సనల్స్తోపాటు అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులకు సోమవారం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునే కార్యక్రమం సజావుగా సాగింది. జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఆదివారం ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో 12,138 మంది పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు 1141 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఇంకా మిగిలిపోయిన వారు సోమవారం ఓటింగ్లో పాల్గొన్నారు. హోమ్ ఓటింగ్: జిల్లాలో తొలిసారి సోమవారం హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. జిల్లాలో 85+ ఓటర్లు 7365, పీడబ్ల్యుడీ ఓటర్లు 18,532 మంది ఉండగా 878 మందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలు బందోబస్తుతో ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ అందజేశారు. ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. కడప నగరంలో 92 మంది ఓటర్లకుగాను 88 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మిగిలిన వారిలో ముగ్గురు మృతి చెందగా, ఒకరు అందుబాటులో లేరు. -
772 ఫిర్యాదులకు పరిష్కారం
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై మొత్తం 775 ఫిర్యాదులు అందగా 772 ఫిర్యాదులకు పరిష్కారం అందించామని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వేర్వేరు వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఫిర్యాదుల పరిష్కార నివేదికను విడుదల చేశారు. మొత్తం 775 ఫిర్యాదులు అందగా 772 ఫిర్యాదులను పరిష్కరించగా... 3 ప్రోగ్రెస్లో ఉన్నాయని వివరించారు. ● సి–విజిల్ ద్వారా మొత్తం 480 కేసులు నమోదు కాగా అందులో 299 నిజనిర్ధారణ కాగా, 181 నిరాధారమైనవిగా గుర్తించడమైంది. ● ఎఫ్ఎస్టి., ఎస్ఎస్టి., పోలీసు ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ద్వారా చేపట్టిన సీజర్ మేనేజ్మెంట్ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ.3,98,44,265ల మేర నగదు, రూ.7,72,82,080 ల విలువైన లిక్కర్, ఇతర వస్తువులను సీజ్ చేయడం జరిగింది. అలాగే 1,268 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. -
ప్రారంభమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలు
వల్లూరు : పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి , శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాలు సోమవారం రెండు ఆలయాల్లో నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైధ్యనాథేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజ నిర్వహించారు. వైద్యనాఽథునికి రుద్రాభిషేకం, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవికి కుంకుమార్చన చేశారు. రాత్రి ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. నందీశ్వరుని చిత్ర పటాన్ని ధ్వజ స్థంభంపై అధిష్టింప చేశారు. రాత్రి హంస వాహనంపై శ్రీ కామాక్షీ వైధ్యనాధ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో తెల్లవారు జామున సుప్రభాత సేవ జరిగింది. అనంతరం ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజను నిర్వహించారు. రాత్రి ధ్వ జారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలతో ప్రారంభించి గరుడుని చిత్ర పటాన్ని ధ్వజ స్థంభంపై అధిష్టింప చేశారు. అనంతరం కొండపై నుంచి వారిని తిరుచ్చి వాహనంలో మోస్తూ గ్రామ మాడ వీధుల్లో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో శ్రీ వైద్యనాథ స్వామి ఆలయ ధ్వజస్థంభ దాత మీగడ శేషారెడ్డి పాల్గొన్నారు. పుష్పగిరిలో నేడు బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ వైధ్యనాధేశ్వర స్వామి ఆలయంలో ఉదయం రుధ్రాభిషేకం, కుంకుమార్చన జరుగుతాయి. రాత్రి స్వామి వారికి సింహవాహన సేవ జరుగుతుంది. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం, తోమాల సేవ ఉంటుంది. రాత్రి స్వామివారికి హంసవాహన సేవ జరుగుతుంది. -
క్రికెట్ ఎంపికలకు విశేష స్పందన
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలకు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించింది. సీనియర్స్, అండర్–23, అండర్–19 విభాగాల్లో నిర్వహించిన ఈ ఎంపికలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ జిల్లా కార్యదర్శి అవ్వారు రెడ్డిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు క్రమశిక్షణ, అంకితభావం అవసరం అన్నారు. ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని సూచించారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులను తొలుత ప్రాబుబుల్స్కు ఎంపిక చేసి మ్యాచ్లు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం ఎంపికలు నిర్వహించి ప్రాబబుల్స్కు ఎంపిక చేశారు. సీనియర్ విభాగంలో 50 మందికి గాను 32 మందిని, అండర్–23 విభాగంలో 70 మందికి గాను 42 మందిని, అండర్–19 విభాగంలో 120 మందికి గాను 60 మందిన ప్రాబబుల్స్కు ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. ఎంపికలను సెలెక్టర్లు నజీర్ అహ్మద్, అబ్దుల్ ఫరూఖ్ రెహమాన్, శివప్రసాద్, ఆనంద్కుమార్, పైడికాల్వ విజయ్కుమార్, మణికుమార్రెడ్డి, విష్ణుప్రసాద్ పరిశీలించారు. కార్యక్రమంలో సీఏవైడీ సంయుక్త కార్యదర్శి ఎం. సాయిపృద్వితేజ్, సిరాజుద్దీన్ దౌలా, సంజయ్కుమార్రెడ్డి, మునికుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 240 మంది క్రీడాకారులు హాజరు ప్రాబబుల్స్ ఎంపిక -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక కొర్రపాడు రోడ్డులో ఐస్క్రీం వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తి ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓంప్రకాష్ (32) రెండేళ్ల నుంచి ఐస్క్రీం వ్యాపారం చేసుకొని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అతను సోమవారం ఐస్క్రీం ఫ్యాక్టరీలో తన వాహనానికి ఉన్న చార్జింగ్ వైర్ తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement