-
అవ్వాతాతలకు తప్పని పాట్లు
●చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది లక్ష్మణేశ్వరం నుంచి నరసాపురంలో బ్యాంకుకు మూడు రోజులుగా పింఛను డబ్బులు కోసం తిరుగుతున్నా. ఎక్కువ మంది ఉండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వలంటీర్ల ద్వారా పంపిణీ చేసి ఉంటే ఈ కష్టాలు తప్పేవి. చంద్రబాబు కుట్రలు చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం దుర్మార్గం. మా ఉసురు తగులుతుంది. – చోడదాసి బొంతమ్మ, జోనానగర్, లక్ష్మణేశ్వరం పొద్దుటి నుంచి బ్యాంకులోనే ఉన్నా లక్ష్మణేశ్వరం నుంచి పింఛను కోసం నరసాపురంలో బ్యాంకుకు వచ్చా. పొద్దుటి నుంచి బ్యాంకులోనే ఉండాల్సి వచ్చింది. అసలే ఎండ దానికి తోడు ఉక్కపోత ఎక్కువగా ఉంది. జనం ఎక్కువగా రావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంకా చాలా సమయం పట్టేట్టు ఉంది. మాలాంటి వృద్ధులపై చంద్రబాబుకు అంత కక్ష ఎందుకో అర్ధం కావడం లేదు. – మేడిది నర్శింహారావు, లక్ష్మణేశ్వరం నరసాపురం రూరల్: జిల్లాలో పింఛన్ల పంపిణీలో నాలుగో రోజు శనివారం కూడా లబ్ధిదారులకు అవస్థలు తప్పలేదు. మండుటెండలో వ్యయప్రయాసలకు గురై బ్యాంకులకు చేరుకుని గంటల తరబడి నిరీక్షిస్తూ అనేక పాట్లు పడ్డారు. బ్యాంకుల వద్ద వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు తీరుతో తమకు ఈ కష్టాలు వచ్చాయని వాపోతున్నారు. గతంలో గ్రామ పంచాయతీలు, గ్రామ కూడళ్ల వద్ద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ జరిగేది. ప్రతి నెలా పింఛను సొమ్ము ఆపసోపాలు పడుడూ పంపిణీ జరిగే ప్రాంతాలకు చేరుకుని గంటల తరబడి నిరీక్షించి నగదు తీసుకునే వారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అవ్వాతాతలకు, అక్కా చెల్లెమ్మలకు ఈ దుస్థితి రాకూడదనే ఉద్దేశంలో అధికారంలోకి వచ్చాక వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఫించన్ల పంపిణీ చేయించారు. ఐదేళ్ల వరకూ పింఛన్ల పంపిణీ సవ్యంగా సాగింది. అయితే వలంటీర్ల వ్యవస్థ ద్వారా తమ పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని భావించిన చంద్రబాబు ఎన్నికల కమిషన్కు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దంటూ చంద్రబాబు, ఆయన అనుచరులు లేఖలు రాశారు. దీంతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. లబ్ధిదారుల్లో దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇంటి దగ్గరకే పింఛన్లు అందించారు. మిగిలిన వారికి సొమ్ములను బ్యాంకుల్లో జమ చేయడంతో మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పడరాని పాట్లు పడుతున్నారు. ఆధార్ అప్డేట్ కాలేదని, కేవైసీ చేయించలేదని చెబుతుండటంతో రోజుల తరబడి పింఛను సొమ్ము కోసం తిరుగుతూ గొల్లుమంటున్నారు. నాలుగో రోజూ బ్యాంకుల వద్ద పండుటాకుల పడిగాపులు పింఛను కోసం రోజుల తరబడి ప్రదక్షిణలు మండుటెండలో వ్యయప్రయాసలతో అవస్థలు చంద్రబాబు తీరుపై మండిపడుతున్న వృద్ధులు చంద్రబాబు వస్తే మళ్లీ ఇబ్బందులే చంద్రబాబు నాయుడు చేసిన పనివల్ల ఎండలో బ్యాంకులకు వెళ్లి పింఛను తెచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో గంటల కొద్దీ క్యూలైన్లో నిలబడి పింఛను డబ్బులు తీసుకోవాల్సి వచ్చేది. ఎన్నికల్లో చంద్రబాబు వస్తే మళ్లీ ఇదే పరిస్థితి. లిఖితపూడి నుంచి బస్సులో నరసాపురం వచ్చి, అక్కడ నుంచి ఆటో కట్టించుకుని రావాల్సి వచ్చింది. – చొప్పల చంద్రకాంతమ్మ, లిఖితపూడి.చంద్రబాబుకు గుణపాఠం చెబుతారు లిఖితపూడి గ్రామం నుంచి నరసాపురంలో ఉన్న యూనియన్ బ్యాంకుకు వచ్చా. పింఛను సొమ్ము తీసుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతూ ఇక్కడకు రాక తప్పలేదు. వృద్ధాప్యం, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న నాలాంటి వాళ్లకు పింఛన్లు అందించడంలో కుట్రలు చేయడం చంద్రబాబుకు సబబు కాదు. ఎన్నికల్లో ప్రజలే టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారు. – పిల్లి సూర్యారావు, లిఖితపూడి -
కూటమి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారు
పెనుగొండ: దళితులు, క్రైస్తవులు, మైనారిటీలను కించపరిచి, వారి మనోభావాలు దెబ్బతీసిన కూటమి పార్టీలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారంతా తగిన బుద్ధి చెబుతారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రే టెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ ఎలక్షన్ కో–ఆర్డినేటర్ గెరా హనోక్ హెచ్చరించారు. ఆచంటలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత మార్పిడిలు చేసుకోవచ్చు, పౌరులు తమకు నచ్చిన మతంలోకి వెళ్లవచ్చని రాజ్యాంగంలోని 25, 28వ అధికరణాలు పేర్కొంటున్నాయని హనోక్ గుర్తు చేశారు. అందుకు భిన్నంగా కూటమి నేతలు క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. దళిత క్రైస్తవులంటే ఎందుకంత చులకన భావమన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత సీఎం జగన్దేనన్నారు. వలంటీర్ వ్యవస్థను తప్పుబట్టిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగిస్తామంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు ఎలా సాధ్యమో కూటమి నేతలే సమాధానం చెప్పాలన్నారు. దళితులు, క్రైస్తవులు, మైనారిటీలను కించపరిచే పార్టీలకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ప్రకటించారు. సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర ట్రెజరర్ బి.ఆశీర్వాదం, ఏఐసీసీ పశ్చిమగోదావరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే డేవిడ్రాజ్ , జిల్లా జనరల్ సెక్రెటరీ ఎన్.క్రీస్తు దాసు, స్టేట్ అడ్వైజర్ బ్రదర్ జె.రాబిన్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరికలు
పెనుగొండ: సిద్ధాంతంలో 10వ వార్డు పంచాయతీ సభ్యురాలు, జనసేన నాయకురాలు ఊటాల భారతి ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. శనివారం సిద్ధాంతంలో జరిగిన ఎన్నికల శంఖారావం పాదయాత్రలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ పోడూరి గోవర్దన రామయ్య, ఎంపీటీసీ సభ్యులు చిన్నం ఏడుకొండలు, గుత్తుల సత్యవతి రాముడు, గ్రామ అధ్యక్షుడు జుత్తిగ దామోదర్, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ పలివెల శ్రీను పాల్గొన్నారు. కొయ్యలగూడెంలో వైనాట్ షోరూం ప్రారంభం కొయ్యలగూడెం: వినియోగదారుల విశ్వాసానికి శాశ్వత చిరునామాగా వైనాట్ దుకాణ సముదాయాలు నిలుస్తున్నాయని సంస్థల అధినేత జుజ్జవరపు రాయుడు అన్నారు. కొవ్వూరు రోడ్లోని విశ్వేశ్వరరావు షాపింగ్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన వైనాట్ షాపింగ్ మాల్ 33వ బ్రాంచ్ ప్రారంభానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వైనాట్ ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయిన్సెస్ షోరూమ్ను ఎల్జీ ఎలక్ట్రానిక్స్ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పి.కిషోర్బాబు ప్రారంభించారు. కొనుగోలు చేసిన వినియోగదారులకు నిర్వహించిన లక్కీడ్రాలో గెలుపొందిన జి.రత్నకుమారికి రూ.12 వేల విలువైన వాషింగ్ మెషీన్ను బహుమతిగా అందజేశారు. తమ షోరూమ్లలో నాణ్యమైన పరికరాలను అందిస్తుండటం వల్ల ప్రజలలో వైనాట్ షాపింగ్ దుకాణాలపై నమ్మకం ఏర్పడిందన్నారు. కట్నం వేధింపులపై కేసు నమోదు భీమవరం: అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ హెచ్సీ ఎస్.శ్రీరాములు శనివారం చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమవరం టుటౌన్ పరిధిలోని బలుసుమూడికి చెందిన ఉద్దరాజు రోహిణికి పదేళ్ల క్రితం రామకృష్ణంరాజుతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కొన్నేళ్లు సజావుగా కాపురం సాగిన అనంతరం ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త రామకృష్ణంరాజు, అత్తమామలు వేధిస్తుండడంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తాపీ కూలీ మృతి కై కలూరు: కూలి పనులు ముగించుకుని సైకిల్పై వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కై కలూరు టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వైఎస్సార్ నగర్కు చెందిన ఆగోళ్లు శ్రీనివాసరావు (60) తాపీ కూలీగా పనిచేస్తున్నాడు. వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్లో పని ముగించుకుని శుక్రవారం సాయంత్రం సైకిల్పై వెళుతుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ పోలీసులు తెలిపారు. -
‘వరి’వడిగా పటు్టబడులు
భీమవరం: ప్రభుత్వ ప్రోత్సాహం, అధికారుల ప్రత్యేక శ్రద్ధతో ఆశాజనకంగా ఉన్న దాళ్వా పంట పట్టుబడులు ఉత్సాహంగా సాగుతున్నాయి. ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు గడువులోపు రైతుల ఖాతాల్లోకి సొమ్ములు జమచేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు రైతుల నుంచి సుమారు రూ.513 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా రూ. 289 కోట్లు చెల్లించారు. జిల్లాలో ప్రస్తుత దాళ్వా సీజన్లో సుమారు 2.20 లక్షల ఎకరాల్లో వరి పండించగా దాదాపు 9.45 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. జిల్లాలోని 263 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 7.50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సార్వా సీజన్ పంట మాసూళ్లు సమయంలో ఆకాల వర్షాల వల్ల మాసూళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ప్రభావం దాళ్వా నాట్లపై పడటంతో సాగు నీటి ఎద్దడి ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేయగా వ్యవసాయ, నీటిపారుదల శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి శివారు భూములకు సైతం పూర్తిస్థాయిలో నీరందించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీటిని అందించడం విశేషం. సంవృద్ధిగా నీటి సరఫరా, వాతావరణం అనుకూలించడంతో పైరు ఏపుగా పెరిగి పంట ఆశాజనం ఉంది. సగటున ఎకరాకు 55 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. నూక సమస్య ఇబ్బంది లేకుండా.. గత దాళ్వా సీజన్లో అధిక ఉష్ణోగ్రత ధాన్యం ఎక్కువ ఎండటం వల్ల బియ్యంలో నూక శాతం పెరిగిపోవడంతో రైతులను ఇబ్బంది బడ్డారు. అధికారులు ముందుగానే రైతులకు అవగాహన కల్పించడంతో ధాన్యం ఎక్కువగా ఎండబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో నూక సమస్య తలెత్త లేదు. రూ.289.96 కోట్ల చెల్లింపు : ప్రస్తుత దాళ్వా సీజన్లో ఇప్పటివరకు 26,826 మంది రైతుల నుంచి సుమారు 2,35,110 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. సుమారు రూ.513.67 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు సుమారు 15 వేల మంది రైతులకు రూ.289.96 కోట్లు చెల్లించారు. పట్టుబడి పట్టిన వారంలోనే ధాన్యం సొమ్ము లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ముమ్మరంగా మాసూళ్లు 263 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 2.35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు రైతుల ఖాతాల్లో రూ.289.67 కోట్ల జమ -
పింఛను కోసం వెళ్లి అనంతలోకాలకు..
పెదపాడు: పింఛను సొమ్ము కోసం బ్యాంకుకు వెళ్లిన ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పెదపాడు గ్రామ శివారు పాతపెదపాడు గ్రామానికి చెందిన దోమతోటి దీనకుమారి (72) పింఛను సొమ్ము కోసం పాతపెదపాడు నుంచి పెదపాడులోని ఇండియన్ బ్యాంకుకు వెళ్లింది. ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరం నడిచి బ్యాంకుకు వెళ్లిన ఆమె.. బ్యాంకుకు వెళ్లిన కొద్దిసేపటికి అక్కడే కుప్పకూలింది. దీంతో సమాచారం అందుకున్న బంధువులు వెంటనే ఆమెను ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ వివరాలను ఆమె కుమారుడు థామస్ శనివారం వెల్లడించారు. వలంటీర్ల సేవలు అందుబాటులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పండుటాకులపై పగబట్టిన చంద్రబాబు తణుకు అర్బన్: వలంటీర్ వ్యవస్థ ద్వారా అవ్వాతాతలకు ఇంటి గుమ్మంలోకే అందుతున్న పింఛను పంపిణీని పచ్చకూటమి నేత చంద్రబాబు అడ్డుకుని వారి ఉసురు తీశాడని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు విమర్శించారు. తణుకులో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. పండుటాకులపై పగబట్టినట్లుగా చంద్రబాబు తన అనుయాయుడు నిమ్మగడ్డ రమేష్తో ఎన్నికల అధికారికి వేసిన పిటిషన్ కారణంగానే అవ్వాతాతలకు ఈ దుస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పింఛను విధానం, పరిపాలన ఎలా ఉంటుందో మచ్చుకు చూపాడని, ప్రజలంతా గమనించాలని కోరారు. నాయకులు సుద్దుల పాండు, సామంతుల అప్పారావు, ఎస్వీ జాకబ్బాబు, సునీల్బాబు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement