-
అమ్మో అదితి..!
విజయనగరం: అదేమీ రోడ్డు కాదు.. మున్సిపల్ అధికారులు చేపట్టాల్సిన రోడ్డు విస్తరణలో భాగమూ కాదు.. ఒక్క మాటలో చెప్పాలంటే మున్సిపాలిటీకి ఆ స్థలాలతో సంబంధం లేదు.. ‘ఆమె’ డైరెక్షన్ ఇచ్చారు.. అంతే.. సంబంధిత ట్రస్టు సభ్యులు రోడ్డెక్కే పని లేకుండా.. చేతులకు మట్టి అంటకుండా అధికారులు పని కానిచ్చేశారు. ఏళ్ల తరబడి ఆ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారి పొట్టలు కొట్టారు. వందలాది మంది పేదల జీవితాలను రోడ్డు పాల్జేజేశారు. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు.. విజయనగరం జిల్లా కేంద్రం నడిబొడ్డున గల మహారాజుల కోట పరిసరాల్లోనే. ఆ స్థలాలు ఎవరివో కాదు.. స్వయానా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు ట్రస్టీగా వ్యవహరిస్తున్న మాన్సాస్కు చెందినవే. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో చిరువ్యాపారుల బతుకులు రోడ్డున పడిన తీరు ఆరేళ్లయినా కళ్లముందే కదలాడుతోంది. అదితి గజపతిరాజు టీడీపీ నుంచి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో నగర వాసులు భయపడుతున్నారు. అధికారంలోకి వస్తే ఇంకెంతమంది ఉపాధి కోల్పోవాల్సి వస్తోందోనని హడలెత్తిపోతున్నారు. తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని విజయనగరంలో పెత్తనం చెలాయించిన ఆమెకు.. పొరపాటున అధికారం చేతికొస్తే పేదల పొట్టకొడతారన్న చర్చ జోరందుకుంది. ● తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని.. 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చారిత్రాత్మక నేపథ్యం కలిగిన విజయనగరం మహారాజా కోట పరిసరాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా కోటకు పడమర దిక్కులో పార్కు తరహాలో తయారు చేసేందుకు 2016 నుంచి పనులు ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉన్నా దశాబ్దాల కిందట అదే మహారాజుల ప్రసాదంగా కోట పరిసరాల్లో చిన్నపాటి వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిని ఒక్కసారిగా రోడ్డు పాల్జేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2017 సంవత్సరం ఫిభ్రవరి నెలలో మున్సిపల్ టౌన్ప్లానింగ్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న వందలాది దుకాణాలను ఖాళీ చేయించేశారు. వాస్తవానికై తే ఇలా ఖాళీ చేయించే బాధ్యతను రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలి. దీనికోసం ముందస్తుగా ట్రస్ట్ నుంచి నోటీసులు జారీ చేయాలి. నిబంధనలపై మాట్లాడేవారిని, అన్యాయమని ప్రశ్నించే వారి గొంతులను పోలీస్ బలగాలతో నొక్కేశారు. మాన్సాస్ ట్రస్టుకు పన్నులు చెల్లిస్తే మున్సిపల్ యంత్రాంగం ఆ స్థలాల నుంచి ఖాళీ చేయించడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తంచేసినా ఫలితం లేకపోయింది. మున్సిపల్ యంత్రాంగానికి ఆ అధికారం ఎవరిచ్చారన్న ప్రశ్న తలెత్తినప్పటికీ... అప్పటికే మాన్సాస్ ట్రస్టు డైరెక్టర్గా ఉన్న అదితి గజపతిరాజు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా వ్యవహరిస్తోన్న తన తండ్రి అధికారంతో ప్రశ్నించే వారిని అధికారులతో బెదిరించి నోర్లు మూయించేశారన్న విషయం వెలుగుచూసింది. దీంతో ఏళ్ల తరబడి ఉపాధి పొందిన వారంతా పేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో వారి వేదనను ఎవరూ పట్టించుకోలేదు. ఈ ప్రక్రియ అంతా మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న పూసపాటి ఆనందగజపతిరాజు మరణానంతరం ట్రస్టీ ఛైర్మన్గా అప్పటికే కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న పూసపాటి అశోక్గజపతిరాజు నేతృత్వంలో డెరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పూసపాటి అదితి లక్ష్మీగజపతిరాజుల డైరెక్షన్లో చేపట్టినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒకానొక దశలో రాజవంశానికి చెందిన పలువురు పెద్దలు అదితి గజపతిరాజు స్వలాభం కోసం వెంపర్లాడుతున్న తీరుపై అసంతృప్తి సైతం వ్యక్తంచేశారు. ఇప్పుడు అధికారం ఇస్తే రాజుల కాలంలో పేదలకు దానం చేసిన భూములను సైతం లాక్కుంటారన్న చర్చ సాగుతోంది. ● రాచరిక పాలనపై హడల్.. విజయనగరం నియోజకవర్గంలో వంశపారపర్య రాచరిక పాలనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా మాన్సాస్ ట్రస్ట్ డైరెక్టర్గా ఉన్న సమయంలోనే పూసపాటి అదితిగజపతిరాజు తన తండ్రి అశోక్గజపతిరాజు అధికారాన్ని ఉపయోగించుకుని సొంత ఆస్తుల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లారా చూసిన విజయనగరం ప్రజలు.. ఆమెను చూసి హడలెత్తిపోతున్నారు. తండ్రినే ఎదిరించి సీటు సంపాదించిన అదితికి మనమెంత అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. బాధితుల గోడు వర్ణనాతీతం..! విజయనగరం మహారాజుల కోట పరిసరాల్లో ఆక్రమణల పేరిట తొలగించిన వారికి ప్రత్యామ్నాయం చూపించడంలో ఏ ఒక్కరికీ సంబంధం లేకుండా పోయింది. స్థలం మాన్సాస్ ట్రస్టుకు చెందగా.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించినది మున్సిపల్ అధికారులు. ఆక్రమణలు తొలగించాలంటూ ఉపాధి పొందుతున్న వారిని హెచ్చరించిన సమయంలోనే వారంతా ఎదురు ప్రశ్నించినా.. ఉన్నతాధికారులు ఆదేశాలంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. బలవతంగా పోలీసుల సమక్షంలో భారీ యంత్రాలతో వారి ఉపాధి గూడులను నేల మట్టం చేశారు. వారి ఆవేదనను రాజులు కనీసం పట్టించుకోలేదు. ఆమె పేరు చెబితేనే భయపడుతున్న విజయనగర వాసులు గతంలో ఆమె చర్యలను తలచుకుంటున్న చిరువ్యాపారులు కోట చుట్టూ షాపులను నిర్ధాక్షిణ్యంగా ఎత్తివేయించిన వైనం బతుకులు రోడ్డు పాలు తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రశ్నించిన వారిపై బెదిరింపులు ఆమెకు పొరపాటున అధికారం ఇస్తే.. రాజులు దానం చేసిన స్థలాలన్నీ లాక్కుంటారన్న భయం ఆ ఐదేళ్లలో కోటచుట్టూనే అభివృద్ధి 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరం అభివృద్ధి కోట, పరిసరాలకే పరిమితమైంది. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న పూసపాటి అశోక్గజపతిరాజు అధికారంతో మాన్సాస్ ట్రస్ట్ డైరెక్టర్గా ఉన్న కుమార్తె పూసపాటి ఆనందగజపతిరాజు పట్టుబట్టి మరీ రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మహారాజుల కోట ప్రాంగణాన్ని అభివృద్ధి చేయించుకున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. వాస్తవానికి విజయనగరంలో సుమారు 15 మార్గాల్లో 2014–19 సంవత్సరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మున్సిపాలిటీ శ్రీకారం చుట్టగా.. అందులో కేవలం పట్టణం నడిబొడ్డున గల కోట పరిసరాల్లో పనులు మాత్రమే నెలల వ్యవధిలో పూర్తి చేయడం గమనార్హం. -
పింఛన్ అందలేదన్న బెంగతో వృద్ధుడి మృతి
మెరకముడిదాం: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాధు ఫలితం మరో వృద్ధుడిని బలితీసుకుంది. పింఛన్ అందలేదన్న బెంగతో మెరకముడిదాం మండలం రామాయవలస సచివాలయం పరిధిలోని ముచ్చపైడయ్య (72) అనే వృద్ధుడు చనిపోయాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పైడియ్యకు భార్య, పిల్లలు లేరు. కొన్నేళ్లుగా సోమలింగాపురంలో నివసిస్తున్న ఆయన వదిన కుమారుడు తవుడు వద్ద ఉంటున్నాడు. ఆయనకు ప్రతినెలా ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3వేలు ఫించన్ను వలంటీరు ఇంటికి తెచ్చి అందించే వాడు. మే నెల పింఛన్ డబ్బులు మెరకముడిదాంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ)లోని ఆయన ఖాతాకు జమయ్యాయి. దీనికోసం నాలుగు రోజులుగా తిరుగుతున్నాడు. బ్యాంకు ఖాతా స్తంభించిపోవడంతో వేలిముద్రలు వేయాల్సి వచ్చింది. ఆయన వేలిముద్రలు సరిగా నమోదుకాకపోవడంతో పింఛన్ డబ్బులు చేతికి అందలేదు. బ్యాంకు, సచివాలయ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పింఛన్ మరి అందదేమోనంటూ గ్రామస్తులు, వదిన కుమారుడు వద్ద తరచూ వాపోయాడు. పింఛన్ అందుతుందని ధైర్యం చెప్పినా మనస్థాపానికి గురై ఆదివారం ఆర్ధరాత్రి పైడయ్య మృతిచెందినట్టు బంధువులు తెలిపారు. -
మొదటి విడత స్ప్రేయింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
పార్వతీపురంటౌన్: దోమల నివారణ మందు స్ప్రేయింగ్ మొదటి విడత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు ఆదేశించారు. ఈ మేరకు సబ్ యూనిట్ అధికారులు, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్స్తో మలేరియా కార్యాలయంలో సోమవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 401 మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న మొదటి విడత ఐఆర్ఎస్ స్ప్రేయింగ్కు ముందస్తుగా వేసిన ప్రణాళిక ప్రకారం కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఉన్న ఏడు సబ్యూనిట్స్ పరిధిలో స్ప్రేయింగ్ నిర్వహించాల్సిన గ్రామాల వివరాలను పీహెచ్సీల వారీగా పరిశీలించారు. ఆయా గ్రామాల పరిధిలో సమన్వయ శాఖతో సమావేశాలు నిర్వహించి ఇంటింటికీ చేపట్టబోయే ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ కార్యాచరణపై సమీక్షించాలని సూచించారు. స్ప్రేయింగ్ నిబంధనలను కచ్చితంగా ఆమలు చేయాలని చెప్పారు. సిబ్బంది సమష్టిగా కృషి చేసి మలేరియా, డెంగీ తదితర జ్వరాలు అదుపులో ఉండేందుకు పాటుపడాలని కోరారు. సమావేశంలో ఏఎంఓ సూర్యనారాయణ, వీబీడీ కన్సల్టెంట్ రామచంద్ర, ఈఓ నాగేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంఓ డాక్టర్ టి.జగన్మోహనరావు -
వెనుకబాటును వెనక్కినెట్టేద్దాం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట నియోజకవర్గం ఇంకా వ్యవసాయ ఆధారిత ప్రాంతమే. ఇక్కడి ప్రజల ఓట్లతో టీడీపీ నాయకులు దశాబ్దాలుగా పదవులను అనుభవించినా చేసిన అభివృద్ధి శూన్యం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మార్పు మొదలైంది. ‘సంక్షేమం, అభివృద్ధికి అసలైన నిర్వచనాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చినప్పుడు తాము ఏం చేశామో చెప్పాలి... ఓటేస్తే ఏం చేస్తామో చెప్పాలి. కానీ టీడీపీ నాయకులు చెప్పుకోవడానికి ఏమీ లేకే వైఎస్సార్సీపీపై దుష్ప్రచారాన్నే అస్త్రంగా చేసుకుంది. ఏ ప్రభుత్వంతో ప్రయోజనమో ప్రజలకు తెలుసు. ఆలోచించి ఓటు వేయకపోతే భవిష్యత్తుకు చేటు’ అని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన ఆయన ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఈ సందర్భంగా సాక్షికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షి: ఎస్.కోటలో బలపడ్డామని కూటమి పార్టీల ప్రచారం మాటేమిటి? కడుబండి: వైఎస్సార్సీపీ బలంగా ఉంది. చెప్పాలంటే ఇంకా పెరిగింది. కచ్చితంగా మెరుగైన మెజార్టీ సాధిస్తాం. ఇటీవల పార్టీలోకి చేరికలే సాక్ష్యం. టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తే ప్రజలు వైఎస్సార్సీపీని వద్దనుకుంటారా? ఎవరేమిటో ప్రజలకు తెలుసు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని, సంక్షేమాన్ని ఇన్నేళ్ల తర్వాత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంతోనే సాధ్యమైంది. అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ వెతికి వెతికి ఇచ్చారు. కూటమి ప్రభావం లేదు. ఫైట్ మళ్లీ టీడీపీతోనే. సాక్షి: కరోనా కష్టకాలం సహా ప్రజల్లోనే ఉన్నారు. ఇంకా ఏమైనా ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారా? కడుబండి: కరోనా కష్టకాలంలో మేము ప్రజలకు అండగా ఉన్నాం. ఇప్పుడు కనిపిస్తున్న టీడీపీ నాయకులు అప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో చెప్పినవన్నీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేశారు. ఇప్పుడు ఆ పథకాలనే మరింత సాయం పెంచి కొనసాగిస్తామని చెప్పారు. బడ్జెట్ అనుకూలతను బట్టి మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అంటే ఏదో ఓట్ల కోసం ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల సాకులతో కోతవేసే ప్రభుత్వం కాదు మాది. చెప్పింది చేశాం... చేసిందే చెబుతున్నాం. సాక్షి: నియోజకవర్గంలో మీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ఏం చెబుతారు? కడుబండి: జలజీవన్ మిషన్లో భాగంగా రూ.216 కోట్ల ఖర్చుతో 270 గ్రామాల్లో ఇంటింటికి కుళాయి పనులు ప్రారంభించాం. 90 గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. 180 గ్రామాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. ఎస్.కోటలో 30 పడకల ిసీహెచ్సీని వంద పడకల ఏరియా ఆస్పత్రిగా మార్చాం. రూ.12.60 కోట్లు మంజూరు చేశాం. పనులు జరుగుతున్నాయి. పెందుర్తి నుంచి బొడ్డవర వరకూ ఉన్న అరుకు రోడ్డును నేషనల్ హైవేగా మార్చాం. దారపర్తి పంచాయతీ పరిధి గిరిశిఖర గ్రామాల్లో డోలీమోతలు ఉండకూడదని దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు రూ.4,89 కోట్లుతో బీటీ రోడ్డు శాంక్షన్ చేశాం. పనులు జరుగుతున్నాయి. బొడ్డవర పంచాయతీలో బొడ్డవర–చిట్టంపాడు రోడ్డుకు రూ.10.75. కోట్లు మంజూరయ్యాయి. సోంపురం–ఆనందపుర రోడ్డు పూర్తయ్యింది. ధర్మవరం హైస్కూల్లో బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేశాం. ఐదు పీహెచ్సీలకు అదనపు భవనాల నిర్మాణ పనులు చేశాం. మరో మూడు పీహెచ్సీల మరమ్మతులకు నిధులు కేటాయించాం. నాడు–నేడులో 90 శాతం పాఠశాలల రూపురేఖలు మార్చాం. 10వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు కేటాయించాం. గ్రామాల్లో 94 సచివాలయాలు, 87 ఆర్బీకేలు, 75 వెల్నెస్ సెంటర్లు మా ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సాక్ష్యాలు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలు చూశాం. తక్షణ పరిష్కారానికి 608 పనులు గుర్తించి వెంటనే నిధులు ఇచ్చాం. ఇలా నిత్యం ప్రజాభివృద్ధి ధ్యేయంగా పనిచేశాం. సాక్షి: నియోజకవర్గంలో మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది? కడుబండి: శృంగవరపుకోట నియోజకవర్గం దీర్ఘకాలంగా వెనుకబడి ఉంది. వలసలు ఎక్కువ. వ్యవసాయ ఆధారంగా జీవించేవారే అధికం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ప్రణాళిక ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖనగరాన్ని రాష్ట్ర పరిపాలన రాజధాని చేస్తానని ఇప్పటికే వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా చెప్పారు. తద్వారా అత్యధికంగా మేలు జరిగేది ఈ నియోజకవర్గానికే. పారిశ్రామిక విస్తరణకు అవసరమైన ప్రభుత్వ భూములు మెండుగా ఉన్నాయి. మానవ వనరులు ఉన్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఒకవైపు జాతీయ రహదారి, మరొకవైపు గ్రీన్ఫీల్డ్ ఎక్ప్ప్రెస్ హైవేలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర సర్వతోముఖాభివృద్ధి జగనన్నతోనే సాధ్యం. జిందాల్ అల్యూమినా రిఫైనరీ వస్తే 2వేల మందికే ఉపాధి. కానీ నేడు ఆ జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటు వల్ల సుమారు 6 వేల మందికి ప్రత్యక్షంగానూ, మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే ప్రతి ఎకరానికి సాగునీరు వస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి దుష్ప్రచారమే అస్త్రంగా టీడీపీ నాయకుల రాజకీయం ఏ ప్రభుత్వంతో ప్రయోజనమో ప్రజలకు తెలుసు ఆలోచించి ఓటు వేయకపోతే భవిష్యత్తుకు చేటు సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సాక్షి: మీ ప్రత్యర్థుల దుర్పచారం మాటేమిటి? కడుబండి: జగనన్న ఇచ్చిన పదవులతో అధికారం అనుభవిస్తూ వాటికి రాజీనామా చేయకుండా ప్రత్యర్థి పార్టీ పచ్చకండువాలు వేసుకున్న బ్యాచ్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. వారి ఆరోపణల్లో వాస్తవాలేమిటో జనానికి తెలుసు. టీడీపీ నాయకులు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పేరుచెప్పి సాగించిన మట్టి అమ్మకాలు, ప్రభుత్వ పోస్టుల అమ్మకాలు, తి.తి.దే దర్శనం టోకెన్లు, దందాలు, జన్మభూమి కమిటీల అరాచకాలను ప్రజలు మరచిపోలేదు. వాళ్ల రెబల్ అభ్యర్థే మీడియా ముందుకొచ్చి గొంతెత్తారు. ఇక వాళ్లు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పి కొడతారు. సాక్షి: 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మీ వ్యూహం ఏమిటి? కడుబండి: ప్రత్యేక వ్యూహాలు ఏమీ లేవు. గత 58 నెలల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పఽథకాలను ప్రచారం చేయడం, అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉండడం, అవినీతిరహిత పాలన అందివ్వడం, నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ విధేయత, విశ్వసనీయత, నమ్మకంగా ఉండడం. అందరికీ సమాన అవకాశం, గౌరవం ఇస్తూ పనిచేయడమే బలం. -
–8లో
సంక్షేమ పాలన మెచ్చి... వైఎస్సార్సీపీ సంక్షేమ పాలన మెచ్చి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. అభిమాన జల్లుగజపతినగరం మండలం పురిటిపెంటలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఊరంతా ఆయనకు మద్దతుగా నిలబడింది.మెరకముడిదాం మండలం భైరిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి బొత్ససత్యనారాయణకు అక్కడి మహిళు హారతిచ్చి స్వాగతం పలికారు. మా మంచి నాయకుడివి నీవేనంటూ ఆశీస్సులు అందించారు. వంగర మండలం మద్దివలస వాసులు వైఎస్సార్సీపీ రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో భాగస్వాములయ్యారు. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటూ నినదించారు. బొబ్బిలి పట్టణంలోని 17, 18 వార్డుల్లో ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు వార్డు వాసులు మద్దతు తెలిపారు. లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేటలో ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.డెంకాడ మండలం గుణుపూరుపేటలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు ఊరంతా మద్దతు తెలిపింది. ఆయన కోలాట బృందంతో అడుగు కలిపి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement