115వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ | Sakshi
Sakshi News home page

115వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

Published Mon, Mar 19 2018 7:23 AM

ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 115వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం విరామం ప్రకటించిన పాదయాత్ర సోమవారం ఉదయం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో తిరిగి ప్రారంభమవుతుంది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దివారిపాలెం క్రాస్ మీదుగా కొనసాగిన యాత్ర కొమ్మూరుకు చేరుకుంటుంది. 

Advertisement
Advertisement