రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

Published Fri, Jan 26 2018 2:11 PM

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సగుటూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ రచనకు కృషి చేసిన మహనీయులను గుర్తు చేసుకున్నారు.

Advertisement
Advertisement