కన్నులపండువగా కైట్‌ ఫెస్టివల్‌.. | Sakshi
Sakshi News home page

కన్నులపండువగా కైట్‌ ఫెస్టివల్‌..

Published Sun, Jan 13 2019 5:15 PM

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. మూడురోజులపాటు జరగనున్న ఈ ఫెస్టివల్‌లో 20 దేశాలకు చెందిన ప్రతినిధులు సందడి చేస్తున్నారు. మనదేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కైట్‌ ఫెస్టివల్‌కుతోడు స్వీట్‌ ఫెస్టివల్‌ కూడా ఇక్కడ జరుగుతుండటంతో పరేడ్‌ గ్రౌండ్‌లో కోలాహలం నెలకొంది. స్వీట్‌ ఫెస్టివల్‌లో భాగంగా 1200 రకాల మిఠాయిలు ఆహూతుల నోరూరింపజేస్తున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement