వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

Published Tue, Feb 27 2018 7:22 AM

రానున్న ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని, కేసీఆర్‌ అండ్‌ కోకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్‌ మోసాలను రాష్ట్ర ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘కాంగ్రెస్‌ ప్రజా చైతన్య యాత్ర’సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభమైంది.