జగన్‌ను సీఎంగా చూడాలి: నిజాముద్దీన్‌ | Sakshi
Sakshi News home page

జగన్‌ను సీఎంగా చూడాలి: నిజాముద్దీన్‌

Published Thu, Apr 4 2019 4:16 PM

రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దీన్‌ అభిప్రాయపడ్డారు. తన అనుచులతో కలిసి ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు వైఎస్‌ జగన్‌ కండువా వేసి ఆహ్వానించారు. ఆ సందర్భంగా నిజాముద్దీన్‌ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి అనుభవం లేకపోయినా తనను నమ్మి ఎంపీగా అవకాశం ఇచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవడానికి వైఎస్సార్‌సీపీలో చేరినట్టు చెప్పారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని చెప్పారు. మహానేత సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement