ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత వైఎస్ జగన్ 199వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి ప్రారంభించారు.
అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్ చేరుకుని, అక్కడ నుంచి అమలాపురం మండలం పెరూరు, పెరూరుపేట వై జంక్షన్ వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం రాజన్న బిడ్డ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి కొంకపల్లి, అమలాపురం వరకు 199వ రోజు పాదయాత్ర సాగనుంది. అమలాపురంలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు.