అగ్రిగోల్డ్‌ బాధితులకు జగన్‌ బాసట | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులకు జగన్‌ బాసట

Published Wed, Feb 15 2017 7:28 AM

అగ్రిగోల్డ్‌ బాధితుల ఆందోళనకు విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్‌ కస్ట మర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘ నేతలు, పెద్ద సంఖ్యలో బాధితులు మంగళవారం జగన్‌ను ఆయన నివాసంలో కలసి తమకు న్యాయం జరగడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందంటూ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 3 నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించామని, అందుకు సహకారం కావాలని వారు జగన్‌ను అభ్యర్థించారు. ఈ మేరకు వారు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో జగన్‌ తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.