టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ దారుణ హత్య | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ దారుణ హత్య

Published Thu, Jul 13 2017 7:11 PM

హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్‌ను అతి దారుణంగా నరికి చంపేశారు. గ్రేటర్‌ వరంగల్‌ 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ పనిచేస్తున్న అనిశెట్టి మురళీని కొంతమంది వ్యక్తులు వేట కొడవళ్లు, కత్తులతో నరికి హత్య చేశారు. రాజకీయ విభేధాలు, పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో టీడీపీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన మురళీ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. హత్య చేసిన వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement