బాలింతల మరణాలపై త్రిసభ్య కమిటీ | Sakshi
Sakshi News home page

బాలింతల మరణాలపై త్రిసభ్య కమిటీ

Published Tue, Feb 7 2017 9:13 AM

నిలోఫర్‌ ఆస్పత్రిలో బాలింతల మరణాలపై ప్రభుత్వం సీరియస్‌ గా స్పందించింది. వైద్య ఆరోగ్య మంత్రి ఆదేశాల మేరకు డీఎంఈ రమణి ఆస్పత్రికి చేరుకుని, బాలింతల మరణాలపై సమగ్ర విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఉస్మానియా డాక్టర్‌ భీంరావుసింగ్, గాంధీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాణి, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ ప్రతిభతో కమిటీ ఏర్పాటైంది. ఈ బృందం సోమవారం నిలోఫర్‌ ఆస్పత్రిని సందర్శించి, సిజేరియన్‌లో వైద్యపరమైన నిర్లక్ష్యంపై ఆరా తీసింది. ప్రభుత్వానికి రెండు రోజుల్లో సమగ్ర నివవేదిక అందే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement