పలు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవటంతో పాటు విస్తరించాలని భారత్, కెన్యా నిర్ణయించాయి. అందులో భాగంగా రక్షణ, భద్రత రంగం, ద్వంద్వ పన్నుల రద్దు సహా ఏడు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆఫ్రికా పర్యటనలో భాగంగా కెన్యా వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ.. సోమవారం ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్యెట్టాతో చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. కెన్యాలో చిన్న, మధ్య తరహా సంస్థలు, జౌళి పరిశ్రమల అభివృద్ధికి సాయంగా రాయితీతో కూడిన రుణాన్ని రూ. 302 కోట్లకు పెంచుతున్నట్లు మోదీ తెలిపారు.
కెన్యాతో రక్షణ బంధం
Published Tue, Jul 12 2016 6:27 AM
Advertisement
తప్పక చదవండి
Advertisement