విద్యార్థినులను బంధించి పూజలు | Sakshi
Sakshi News home page

విద్యార్థినులను బంధించి పూజలు

Published Mon, Jun 29 2015 4:13 PM

వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలలో పూనకంతో ఊగిపోయిన ఓ వర్కర్ విద్యార్థినులను బంధించి పూజలు చేసింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థినులను వారి తరగతి గదిలోనే బంధించి పూజలు చేసింది. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై కూడా ఆమె చిర్రుబుర్రులాడింది. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్‌కు వచ్చి హల్‌చల్ చేసిన సదరు మహిళను మందలించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులకు పోలీసులు సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement