అన్నాడీఎంకే కార్యాలయం వద్ద కలకలం | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే కార్యాలయం వద్ద కలకలం

Published Wed, Apr 26 2017 1:26 PM

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం కలకలం చోటుచేసుకుంది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ కటౌట్లు, బ్యానర్లను తొలగించడం చర్చకు దారితీసింది. లంచం కేసులో దినకరన్‌ అరెస్టైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాల్లోనూ శశికళ, దినకరన్‌ పోస్టర్లను తొలగించాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement