భర్త వేధింపులకు మరో మహిళ బలైంది. మంచిర్యాలకు చెందిన డాక్టర్ నవ్య సోమవారం ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మృతి మొత్తం అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. సోమవారం తెల్లవారుజామున బాత్రూంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, తన భార్య బాత్రూంలో పడిపోయిందని.. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లందని ఆమె భర్త, స్థానికంగా జనరల్ ఫిజీషియన్ అయిన డాక్టర్ మనోజ్ కుమార్ పలువురు మిత్రులకు తెలిపారు. కాసేపటికే ఆమె చనిపోయిందని చెప్పి, నవ్య తండ్రి డాక్టర్ రాంబాబు ఇంటికి మృతదేహాన్ని తరలించారు. అక్కడ ఫ్రీజర్ బాక్సులో నవ్య మృతదేహాన్ని ఉంచారు. కాసేపటి తర్వాత విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భర్త వేధింపుల కారణంగానే డాక్టర్ నవ్య ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య మృతదేహం వద్ద మనోజ్ కుమార్ ఏడుస్తున్నా, అది ఏమాత్రం సహజంగా లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆయన నిజంగానే తన భార్య మృతిపట్ల బాధపడుతున్నారని చెబుతున్నారు. నవ్య తండ్రి డాక్టర్ రాంబాబు మంచిర్యాలలో గత 20-30 ఏళ్లుగా ప్రసిద్ధి చెందిన రేడియాలజిస్టు. ఆయన స్కానింగ్ సెంటర్ అంటే ఈ ప్రాంతంలో చాలామందికి మంచి గురి ఉంది. అయితే, వైద్య విద్య పూర్తి చేసిన నవ్య మాత్రం ప్రస్తుతం ప్రాకట్ఈసు చేయకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
డాక్టర్ నవ్య అనుమానాస్పద మృతి
Published Mon, Feb 10 2014 3:08 PM
Advertisement
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement