Sakshi News home page

నవ్విపోదురు గాక..!

Published Fri, Mar 29 2024 2:00 AM

ఎడ్లగోపీతో పాటు, అనుచరులను టీడీపీలోకి ఆహ్వానిస్తున్న దృశ్యం - Sakshi

గజపతినగరం రూరల్‌: ఎన్నికల సమయంలో ఓట్లు ఎంతో కీలకం కాబట్టి ఎంతటివారైనా తమ పార్టీలోకి వస్తే పార్టీ బలంగా తయారవుతుందనే ఆశ సంబంధిత పార్టీ నాయకులకు ఉండడం సహజమే. అయితే అదే పార్టీలో ఉండే వారిని మళ్లీ తమ పార్టీలోకి చేర్చుకోవడం చూస్తే వీరికేమేనా మతి భ్రమించిందా అని స్థానికులు నవ్వుకుంటున్నారు. ఈ మేరకు గజపతినగరం మండల కేంద్రంలోని 6వవార్డుకు చెందిన ఎడ్ల గోపి టీడీపీ నుంచి వార్డు మెంబర్‌గా గెలిచారు. ఆయన కొన్నాళ్లుగా టీడీపీలోనే కొనసాగుతున్నారు. గతంలో కూడా టీడీపీ నాయకుడు కరణం శివరామకృష్ణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు స్ధానికుల సమాచారం. అయితే గురువారం వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరుతున్నాడంటూ గజపతినగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌, గోపీతో పాటు కొంతమందికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయమై సదరు గోపీ వద్ద సాక్షి ప్రస్తావించగా తాను వైఎస్సార్‌సీపీలో ఎప్పుడూ పనిచేయలేదని, ఇప్పటివరకూ టీడీపీలో అఫీషియల్‌గా చేరలేదని అందుకే ఈరోజు టీడీపీ తీర్ధం పుచ్చుకుంటున్నాని చెప్పారు.

టీడీపీ నాయకుల గిమ్మిక్కులు

పార్టీలో ఉన్న వారికే మళ్లీ కండువాలు

Advertisement

What’s your opinion

Advertisement