Sakshi News home page

No Headline

Published Thu, Mar 28 2024 1:05 AM

-

ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ వీధి, వార్డు, ఇంటికి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. విజయ తిలకం దిద్ది మనస్ఫూర్తిగా

ఆశీర్వదిస్తున్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ, అభివృద్ధి పాలనతో తమ బతుకులు బాగుపడ్డాయని, సమస్యలు పరిష్కారమయ్యాయని, జీవనంలో స్పష్టమైన మార్పు వచ్చిందని

చెబుతున్నారు. మేలు చేసేవారిని గుర్తించుకుంటామని, ఓటుతో మద్దతు తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు. గుర్ల, వంగర, తెర్లాం, పూసపాటిరేగ, దత్తిరాజేరు మండలాల్లోని పలు గ్రామాల్లో

బుధవారం ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు బొత్స సత్యనారాయణ, తలే రాజేష్‌, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు,

బడ్డుకొండ అప్పలనాయుడు,

బొత్స అప్పలనరసయ్య, ఎంపీ అభ్యర్థి బెల్లాన

చంద్రశేఖర్‌కు అడుగడుగునా జనం నీరాజనం

పలికారు. నాయకులతో కలిసి ముందుకు సాగారు.

– సాక్షినెట్‌వర్క్‌

Advertisement

What’s your opinion

Advertisement