Sakshi News home page

జగనన్నే మళ్లీ సీఎం

Published Thu, Mar 28 2024 1:05 AM

మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర  - Sakshi

సాలూరు: కొద్దిరోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డినే మళ్లీ సీఎంగా చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, సర్వేలన్నీ ఇవే చెబుతున్నాయని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడుతూ ఇటీవల వచ్చిన ఆత్మసాక్షి, ఫస్ట్‌ స్టెప్‌ సొల్యూషన్‌ సర్వేల్లో జగన్‌మోహన్‌రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమ ని తేలిందన్నారు. ఐదేళ్లలో సాగిన సంక్షేమ, అభివృద్ధి పాలనకు గుర్తుగా ఫ్యాన్‌గుర్తుకు ఓటేసి జగనన్నను ఆశీర్వదించేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. డిప్యూటీ సీఎం పదవిని గిరిజనులకు కేటాయించి గౌరవించారని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు, కార్యకర్తలను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నట్టు చెప్పారు.

సర్వేలన్నీ ఇవే చెబుతున్నాయి

డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర

Advertisement

What’s your opinion

Advertisement