Sakshi News home page

నగల వర్క్‌షాప్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు

Published Wed, Mar 27 2024 12:30 AM

-

అన్నానగర్‌: నగల వర్క్‌షాప్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం మధ్యాహ్నం నుంచి దాడులు చేశారు. వివ రాల్లోకి వెళితే.. చైన్నెలోని షావుకార్‌పేట్‌ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నగల వర్క్‌షాప్‌లు, నగల దుకాణాలు ఉన్నాయి. సాధారణంగా ఇతర జిల్లాలు, బయటి ప్రాంతాల నుంచి వ్యాపారులు హోల్‌ సేల్‌, రిటైల్‌ ఆభరణాల కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి జ్యుయలరీ వర్క్‌షాప్‌లు, జ్యుయలరీ షాపుల్లో ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించడం లేదని ఫిర్యాదులు అందాయి. దీంతో షావుకార్‌పేటలోని ఎడపాళెం వీధిలో మోల్డింగ్‌ కుమార్‌కు చెందిన బంగారు నగల వర్క్‌షాప్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం మధ్యా హ్నం నుంచి దాడులు చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు అక్కడి 3 జ్యు యలరీ వర్క్‌షాపుల్లో దాడులు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement