యువతికి చిత్రహింసలు | Sakshi
Sakshi News home page

యువతికి చిత్రహింసలు

Published Sat, Jan 20 2024 1:22 AM

-

అన్నానగర్‌: యువతిని వివస్త్రను చేసి చిత్రహింసలు పెట్టినట్లుగా డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కొడుకు, కోడలుపై కేసు నమోదైంది. సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని సీమాన్‌, అన్నామలై ఒత్తిడి చేస్తున్నారు. కళ్లకురిచ్చి జిల్లా తిరునానుంగున్రం గ్రామానికి చెందిన వీరమణి. కొన్నేళ్ల క్రితం ముంబయి వెళ్లిన అతను ఇంటికి తిరిగి రాలేదు. ఇతని భార్య సెల్వి(38) కేలంబాక్కంలో గృహ కార్మికురాలు. ఆమెకు 18, 16 సంవత్సరాల వయసుగల కుమార్తెలు ఉన్నారు. నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డాక్టర్‌ కావాలన్నది ఆ యువతి కల. కానీ ఇంటి పేదరికం అందుకు అనుమతించలేదు. ఈ స్థితిలో సెల్వికి చిత్రం ద్వారా తిరువాన్మియూరు సౌత్‌ అవెన్యూలోని అపార్టుమెంటులో నివశిస్తున్న పల్లావరం నియోజకవర్గం డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు ఆండ్రో(35), కోడలు మార్లెనా(31) పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మీ కూతురును డాక్టర్‌ చేస్తున్నామని చెప్పారు. చదువుకునే సమయం కాకుండా మిగతా సమయంలో ఇంటి పనిచేయమని జీతం ఇస్తామని తెలిపారు. సెల్వి వారిని నమ్మి కూతురిని అప్పగించింది. కానీ వారు యువతికి చదువు చెప్పే ఏర్పాటు చేయకుండా చిత్రహింసలు కొనసాగించారు. ఇంకా ఆమెను నగ్నంగా చేసి చిత్ర హింసలు చేసి చెప్పులు తుడవడం, చెంచా వస్తువులతో తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టారు. రెడ్‌లైట్‌ ఏరియాకు వెళితే మీరు, మీ అమ్మ బాగా సంపాదించవచ్చునని కులం పేరుతో వేధింపులకు గురై దూషించిన యువతిని ఉలుందూరుపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్సకు అనుమతించారు. దీనిపై ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ స్థితిలో ఇది రాజకీయ పరంగా మారి ఎమ్మెల్యే కుమారుడు, కోడలిపై తగిన చర్యలు తీసుకోవాలని సీమాన్‌, అన్నామలై ఒత్తిడి చేస్తున్నారు.

Advertisement
Advertisement