Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Published Tue, Mar 26 2024 7:55 AM

-

హస్తినాపురం: ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ హాస్టల్‌ విద్యార్థి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రం, కందుకూరు మండలం, పందలపాడుకు చెందిన కిరణ్‌కుమార్‌(26) ప్రైవేటు ఉద్యోగి. ఆయన హస్తినాపురంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి గదిలోకి వెళ్లిన అతను సోమవారం కూడా బయటికి రాకపోవడంతో పక్క గదిలో ఉండే యువకులు హాస్టల్‌ నిర్వాహకుడు సుధాకర్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే అక్కడకు చేరకుని పరిశీలించగా కిరణ్‌కుమార్‌ లుంగీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. సుధాకర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సుందర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాస్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపార

Advertisement

What’s your opinion

Advertisement