Sakshi News home page

జాతీయ కబడ్డీ జట్టుకు సిపోరా ఎంపిక

Published Fri, Mar 29 2024 1:20 AM

సిపోరా  - Sakshi

సింగరాయకొండ(మర్రిపూడి): జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ బాలికల కబడ్డీ జట్టుకు సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.సిపోరా ఎంపికై ంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన 49వ ఏపీ అంతర్‌ జిల్లాల సబ్‌ జూనియర్‌ బాలికల కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరచి సిపోరా ఎంపికై నట్లు హెచ్‌ఎం డీవీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు బీహార్‌ రాజధాని పాట్నాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో సిపోరా పాల్గొంటుందని పీడీ పి.హజరత్తయ్య పేర్కొన్నారు. సిపోరాను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కబడ్డీ అసోసియేషన్‌ ప్రతినిధులు అభినందించారు.

Advertisement

What’s your opinion

Advertisement