ఏదైనా కష్టం వస్తే ఆ ఇల్లు గడవడం చాలా కష్టమవుతుంది. అంతేకాకుండా ఇంటి పెద్దను కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు అంతా ఏ పనికి వెళ్లకుండా సపర్యలు చేస్తూ అక్కడే ఉండిపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది తినడానికి తిండి లేక పస్తులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వారికి ఆసరా ఎంతోగానో ఉపయోగపడుతుంది. రోజుకు రూ.225 చొప్పన నెలకు 5 వేలు వరకు భృతి ఇస్తుంది.
1536 వ్యాధులకు వర్తింపు
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1536 వ్యాధులకు ఆరోగ్య ఆసరా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఆపరేషన్ కోసం రోగి చేరిన వెంటనే ఆరోగ్యమిత్ర రోగి బ్యాంక్ అకౌంట్ నంబరును రిజిస్ట్రర్ చేస్తారు. డిశ్చార్జ్ అయిన తర్వాత రోగి బ్యాంక్ అకౌంట్లో నేరుగా విశ్రాంతి భృతి జమవుతుంది.
ఐదేళ్లలో 1,38,782 మందికి లబ్ధి
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద గడిచిన ఐదేళ్లలో లక్షలాది మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది. 1,38,782 మందికి లబ్ధి చేకూరింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.71.01 కోట్లు వెచ్చించింది.