కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలం లింగాయిపల్లికి చెందిన తొట్టు భూమయ్య(70)అదృశ్యమైనట్లు దేవునిపల్లి ఎస్సై రాజు గురువారం తెలిపారు. ఈ నెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లిన భూమయ్య ఇంటికి తిరిగిరాలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భూమయ్య కూతురు మమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజు తెలిపారు.
దేవునిపల్లికి చెందిన వ్యక్తి..
కామారెడ్డి క్రైం: మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన దేవల సంజయ్ అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సంజయ్ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. సంజయ్ ఆచూకీ లభించకపోవడంతో అతడి భార్య శ్రీలత పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నా మని ఎస్హెచ్వో తెలిపారు.ఇటీవల ఇంటిని నిర్మించిన సంజయ్కు అప్పులు పెరిగినట్లు తెలిసింది.
పేకాట స్థావరంపై దాడి
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని నాల్గోటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్ లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి ఆదేశాల మేరకు సీఐ అంజయ్య సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఎనిమిది మంది పట్టుబడగా, వారి వద్ద నుంచి రూ.56వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ప్రస్తుతం పోలీసులకు పట్టుబడిన పేకాటరాయుళ్ల గతంలో కూడా పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. పేకాటస్థావరాన్ని ఇద్దరు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దాడిలో ట్రాస్క్ఫోర్స్ సిబ్బంది లక్ష్మన్న, సుదర్శన్, అనిల్, నర్సయ్య, అజాం తదితరులు పాల్గొన్నారు.