యశవంతపుర: మంగళూరు సమీపంలోని బైకంపాడి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫిష్ ఆయిల్ గోడౌన్లో మంటలు వ్యాపించి మొత్తం కాలిపోయింది. మంగళూరుకు చెందిన మహ్మద్ అనే వ్యక్తికి పారిశ్రామిక వాడలో కోడి, ఫిష్ వేస్ట్తో ఆయిల్ తయారీ పరిశ్రమ ఉంది. బుధవారం అర్ధరాత్రి గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను ఆదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Breadcrumb
- HOME
Related news
-
నేడు ప్రధాని మోదీ రాక
సాక్షి బెంగళూరు: బెంగళూరులోని వివిధ లోక్సభ నియోజకవర్గాలు, గ్రామీణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వస్తుండడంతో కార్యకర్తల్లో, ఓటర్లలో కొత్త ఉత్సాహం వచ్చిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర తెలిపారు. నరేంద్ర మోదీ కార్యక్రమం శనివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని విహార్గేట్లో జరగనుందని తెలిపారు. శుక్రవారం ప్యాలెస్ మైదానంలో ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లను విజయేంద్ర పరిశీలించి ఆ తర్వాత జరిగిన ప్రధాని భారీ బహిరంగ సభ కర్టన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విజయేంద్ర మాట్లాడుతూ చిక్కబళ్లాపుర కార్యక్రమం తర్వాత బెంగళూరులో ప్రధాని మోదీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మొత్తం 60 వేల మంది కూర్చొనేలా సీట్లను ఏర్పాటు చేసినట్లు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. హుబ్లీలో జరిగిన ఘటన కేవలం వ్యక్తిగత కారణాలతో జరిగినట్లు సీఎం, హోం మంత్రి చెప్పడం శోచనీయమని, దేశద్రోహులకు రక్షణ కలిగించేలా వారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఒక్కరోజే 8 హత్య కేసులు నమోదు అయ్యాయని, ఇలా నేరాలు రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు, చిక్కబళ్లాపురంలో బహిరంగ సభలు ఓటర్లలో కొత్త ఉత్సాహం వచ్చిందన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర -
నేడు రాయదుర్గం వైఎస్సార్సీపీ ఆత్మీయ భేటీ
బనశంకరి: ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడమే లక్ష్యంగా పార్టీ ఐటీ వింగ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి మద్దతుగా బెంగళూరులో నివాసం ఉండే రాయదుర్గం ప్రజలతో ఈనె 20వ తేదీ శనివారం బెంగళూరులో ఐటీ వింగ్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది. సుంకదకట్టెలో పీ అండ్ టీ లేఔట్లో మాగడి రోడ్డు శివనంది కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు సమావేశం ఆరంభమవుతుంది. ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఐటీ వింగ్ తెలిపింది. హాజయ్యేవారు ఈ లింక్లో https://-docs.googl.com/forms/d/e/1FAlpQLScSNUBRFOiOeQ6Yxaoqvcdnhxtjey9oBLcqW5BT-UsBmt2Q4A/viewform లో రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ముచ్చుమర్రి రాకేశ్రెడ్డి–6302989417 , శరన్– 7893830381, రాజశేఖర్రెడ్డి– 9703518965 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
పలు ప్రాంతాలకు వర్ష సూచన
బనశంకరి: వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. బెంగళూరు నగర, గ్రామాంతర, దక్షిణకన్నడ, గుల్బర్గా, రాయచూరు జిల్లాల్లో కొద్ది గంటల్లో వర్షం కురుస్తుందని భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మూడు చెరువుల పునరుద్ధరణబనశంకరి: రెండు నెలలుగా బెంగళూరు నగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చడంతో ప్రజల దప్పిక తీర్చేందుకు రాయల్ చాలెంజర్స్ నడుం బిగించింది. ఇందులో భాగంగా మూడు చెరువులను అభివృద్ధి చేసింది. ఇండియా కేర్స్ ఫౌండేషన్తో కలిసి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇట్టిగల్పుర, సాదేనహళ్లి, కణ్ణూరు చెరువుల్లో పూడిక తొలగించారు. ఇట్టిగల్పుర, సాదేనహళ్లి చెరువులనుంచి సుమారు 1.2 లక్షటన్నుల పూడికను తొలగించారు. పూడిక మట్టిని 52 మంది రైతులు తమ పొలాలకు తరలించారు. చెరువుల్లో పూడిక తొలగించడంతో 17 ఎకరాల మేర నిల్వ ఉంటుంది. కణ్ణూరుచెరువు చుట్టూ ఔషధమొక్కలు, వెదురు ఉద్యానవనం నిర్మించినట్లు ఆర్సీబీ తెలిపింది. 24 నుంచి నిషేధాజ్ఞలు మైసూరు : ఎన్నికల నేపథ్యంలో ఈనెల 24న సాయంత్రం ఆరు గంటలనుంచి 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు మైసూరులోని 200 పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ బీ రమేష్ శుక్రవారం తెలిపారు. నగరంలో ఐదుగురుకంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదన్నారు. ఊరేగింపులు, సభలు, ధర్నాలు నిషేధించినట్లు తెలిపారు. -
రైస్పుల్లింగ్ పేరుతో వంచన
బనశంకరి/కృష్ణరాజపుర: రైస్ పుల్లింగ్పేరుతో నకిలీ తామ్రపాత్ర చూపించి వంచనకు పాల్పడిన ముగ్గురు వంచకులకు బేడీలు పడ్డాయి. పంజాబ్కు చెందిన సన్నిగిల్, తమిళనాడువాసి రమేశ్, బెంగళూరు నగరనివాసి శివశంకర్ అనే నిందితులను శుక్రవారం జయనగరపోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ. 69.79 లక్షల నగదు, నకిలీ తామ్రపాత్రను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జయనగర 6 వబ్లాక్ యడియూరుచెరువు వద్ద రైస్పుల్లింగ్ తామ్రపాత్ర విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. శుక్రవారం జయనగర పోలీసులు దాడిచేసి నిందితులను అరెస్ట్చేశారు. అనంతరం వారిని కోర్టులో హజరుపరిచారు. నిందితులనుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో వారిని 5 రోజులపాటు కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. కాగా నిందితులు చాలా చోట్ల అనేక మందిని వంచించినట్లు పోలీసులు తెలిపారు. రూ.69.79 లక్షలు స్వాధీనం -
అర్ధరాత్రి మారణకాండ
సాక్షి బళ్లారి: గదగ్ నగరంలో గురువారం అర్ధరాత్రి మారణకాండ చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. హతులను నగరసభ ఉపాధ్యక్షురాలు సునంద బాకళె కుమారుడు కార్తీక్ బాకళె(27), పరశురామ (55), లక్ష్మీ (45), ఆకాంక్ష(16)గా గుర్తించారు. కుటుంబ సభ్యులు పైఅంతస్తులో గాఢ నిద్రలో ఉండగా దుండగులు చొరబడి వేట కొడవవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యోదంతానికి పాల్పడ్డారు. గదిలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రక్తం ఏరులై పారింది. దుండగుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధితులు యత్నించగా వెంటాడి నరికినట్లుగా ఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపించాయి. భీతావహంగా ఘటన స్థలం హత్య జరిగిన స్థలం రక్తం మడుగులతో భీతావహంగా ఉంది. ఇంటిలోని వస్తు సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. మహిళలు అనే కనికరం లేకుండా కొడవళ్లతో నరికి హత్య చేయడం నగరవాసులను కలవరపాటుకు గురి చేసింది. హంతకులు ఎవరు.. హత్యోదంతం కుటుంబ గొడవలతోనే జరిగినట్లు కొందరు చెబుతున్నారు. హంతకులు ఎవరు, ఏ ప్రాంతంనుంచి వచ్చారు..లోపలకు ఎలా చొరబడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ వీఎస్ నేమగౌడ ఆధ్వర్యంలో క్లూస్టీమ్, డాగ్ స్క్వాడ్తో సోదాలు నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గదగ్లో దారుణహత్యలు ఒకే ఇంటిలో నలుగురు హతం మారణాయుధాలతో చెలరేగిన దుండగులు కుటుంబ కలహాలే హత్యలకు కారణమా? ఆ రాత్రి వెళ్లిపోయి ఉంటే.. సునంద ప్రకాష్ బాకళె కుమారుడు కార్తీక్ బాకళె(27) వివాహా నిశ్చితార్థానికి కొప్పళకు చెందిన పరుశురామ్(55), లక్ష్మి (45) దంపతులు తమ కుమార్తె ఆకాంక్ష(17)తో కలిసి వచ్చారు. 18వ తేదీ ఉదయం వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంబరాలు ముగిసిన తర్వాత బంధువులు, మిత్రులు వారి వారి ప్రాంతాలకు తరలి వెళ్లగా పరుశురామ, లక్ష్మి, ఆకాంక్ష కొప్పళకు తిరిగి వచ్చేందుకు గురువారం రాత్రి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బంధువుల ఒత్తిడితో కార్తీక్ బాకళె ఇంటిలోనే వారు బస చేశారు. కార్తీక్బాకళె(27)తో పాటు పైఅంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి జరిగిన హత్యోదంతంలో కార్తీక్ బాకళెతోపాటు పరశురామ, లక్ష్మి, ఆకాంక్షలు కూడా బలయ్యారు.
Related News by category
-
రైస్పుల్లింగ్ పేరుతో వంచన
బనశంకరి/కృష్ణరాజపుర: రైస్ పుల్లింగ్పేరుతో నకిలీ తామ్రపాత్ర చూపించి వంచనకు పాల్పడిన ముగ్గురు వంచకులకు బేడీలు పడ్డాయి. పంజాబ్కు చెందిన సన్నిగిల్, తమిళనాడువాసి రమేశ్, బెంగళూరు నగరనివాసి శివశంకర్ అనే నిందితులను శుక్రవారం జయనగరపోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ. 69.79 లక్షల నగదు, నకిలీ తామ్రపాత్రను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జయనగర 6 వబ్లాక్ యడియూరుచెరువు వద్ద రైస్పుల్లింగ్ తామ్రపాత్ర విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. శుక్రవారం జయనగర పోలీసులు దాడిచేసి నిందితులను అరెస్ట్చేశారు. అనంతరం వారిని కోర్టులో హజరుపరిచారు. నిందితులనుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో వారిని 5 రోజులపాటు కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. కాగా నిందితులు చాలా చోట్ల అనేక మందిని వంచించినట్లు పోలీసులు తెలిపారు. రూ.69.79 లక్షలు స్వాధీనం -
పలు ప్రాంతాలకు వర్ష సూచన
బనశంకరి: వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. బెంగళూరు నగర, గ్రామాంతర, దక్షిణకన్నడ, గుల్బర్గా, రాయచూరు జిల్లాల్లో కొద్ది గంటల్లో వర్షం కురుస్తుందని భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మూడు చెరువుల పునరుద్ధరణబనశంకరి: రెండు నెలలుగా బెంగళూరు నగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చడంతో ప్రజల దప్పిక తీర్చేందుకు రాయల్ చాలెంజర్స్ నడుం బిగించింది. ఇందులో భాగంగా మూడు చెరువులను అభివృద్ధి చేసింది. ఇండియా కేర్స్ ఫౌండేషన్తో కలిసి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇట్టిగల్పుర, సాదేనహళ్లి, కణ్ణూరు చెరువుల్లో పూడిక తొలగించారు. ఇట్టిగల్పుర, సాదేనహళ్లి చెరువులనుంచి సుమారు 1.2 లక్షటన్నుల పూడికను తొలగించారు. పూడిక మట్టిని 52 మంది రైతులు తమ పొలాలకు తరలించారు. చెరువుల్లో పూడిక తొలగించడంతో 17 ఎకరాల మేర నిల్వ ఉంటుంది. కణ్ణూరుచెరువు చుట్టూ ఔషధమొక్కలు, వెదురు ఉద్యానవనం నిర్మించినట్లు ఆర్సీబీ తెలిపింది. 24 నుంచి నిషేధాజ్ఞలు మైసూరు : ఎన్నికల నేపథ్యంలో ఈనెల 24న సాయంత్రం ఆరు గంటలనుంచి 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు మైసూరులోని 200 పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ బీ రమేష్ శుక్రవారం తెలిపారు. నగరంలో ఐదుగురుకంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదన్నారు. ఊరేగింపులు, సభలు, ధర్నాలు నిషేధించినట్లు తెలిపారు. -
పోలీసులపై నైజీరియన్ల దాడి
యశవంతపుర: బెంగళూరు నగరంలో నైజీరియా పౌరుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. సమాచారం సేకరించటానికి వెళ్లిన బెంగళూరు సీసీబీ పోలీసులపై నైజీరియన్లు దాడులు చేశారు. గురువారం అర్ధరాత్రి యలహంక తాలూకా రాజానుగుంట సమీపంలోని మావళ్లిపురలో ఉంటున్న నైజీరియన్లు పోలీసులపై హెల్మెట్లతో దాడి చేయడంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఓ డ్రగ్స్ కేసులో నైజీరియా పౌరుడిని విచారణ చేయడానికి సీసీబీ బృందం అక్కడికి వెళ్లిన సమయంలో మొదట వాగ్వాదం జరిగింది. రోడ్డుపైనే దౌర్జన్యానికి పాల్పడారు. అనంతరం ఫోన్లు చేసి 10 మంది తమ వారిని పిలుపించుకున్నారు. పోలీసులను తరిమితరిమి కొట్టారు. ఘటనకు సంబంధించి సీసీబీ అధికారి ఫిర్యాదు ఆధారంగా బాగలగుంటె పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు బెంగళూరు గ్రామీణ ఎస్పీ మల్లికార్జున తెలిపారు. దాడి సమాచారం అందుకున్న రాజానుకుంటె పోలీసులు సీసీబీ పోలీసులకు రక్షణ కల్పించారు. -
అర్ధరాత్రి మారణకాండ
సాక్షి బళ్లారి: గదగ్ నగరంలో గురువారం అర్ధరాత్రి మారణకాండ చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. హతులను నగరసభ ఉపాధ్యక్షురాలు సునంద బాకళె కుమారుడు కార్తీక్ బాకళె(27), పరశురామ (55), లక్ష్మీ (45), ఆకాంక్ష(16)గా గుర్తించారు. కుటుంబ సభ్యులు పైఅంతస్తులో గాఢ నిద్రలో ఉండగా దుండగులు చొరబడి వేట కొడవవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యోదంతానికి పాల్పడ్డారు. గదిలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రక్తం ఏరులై పారింది. దుండగుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధితులు యత్నించగా వెంటాడి నరికినట్లుగా ఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపించాయి. భీతావహంగా ఘటన స్థలం హత్య జరిగిన స్థలం రక్తం మడుగులతో భీతావహంగా ఉంది. ఇంటిలోని వస్తు సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. మహిళలు అనే కనికరం లేకుండా కొడవళ్లతో నరికి హత్య చేయడం నగరవాసులను కలవరపాటుకు గురి చేసింది. హంతకులు ఎవరు.. హత్యోదంతం కుటుంబ గొడవలతోనే జరిగినట్లు కొందరు చెబుతున్నారు. హంతకులు ఎవరు, ఏ ప్రాంతంనుంచి వచ్చారు..లోపలకు ఎలా చొరబడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ వీఎస్ నేమగౌడ ఆధ్వర్యంలో క్లూస్టీమ్, డాగ్ స్క్వాడ్తో సోదాలు నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గదగ్లో దారుణహత్యలు ఒకే ఇంటిలో నలుగురు హతం మారణాయుధాలతో చెలరేగిన దుండగులు కుటుంబ కలహాలే హత్యలకు కారణమా? ఆ రాత్రి వెళ్లిపోయి ఉంటే.. సునంద ప్రకాష్ బాకళె కుమారుడు కార్తీక్ బాకళె(27) వివాహా నిశ్చితార్థానికి కొప్పళకు చెందిన పరుశురామ్(55), లక్ష్మి (45) దంపతులు తమ కుమార్తె ఆకాంక్ష(17)తో కలిసి వచ్చారు. 18వ తేదీ ఉదయం వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంబరాలు ముగిసిన తర్వాత బంధువులు, మిత్రులు వారి వారి ప్రాంతాలకు తరలి వెళ్లగా పరుశురామ, లక్ష్మి, ఆకాంక్ష కొప్పళకు తిరిగి వచ్చేందుకు గురువారం రాత్రి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బంధువుల ఒత్తిడితో కార్తీక్ బాకళె ఇంటిలోనే వారు బస చేశారు. కార్తీక్బాకళె(27)తో పాటు పైఅంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి జరిగిన హత్యోదంతంలో కార్తీక్ బాకళెతోపాటు పరశురామ, లక్ష్మి, ఆకాంక్షలు కూడా బలయ్యారు. -
నేడు రాయదుర్గం వైఎస్సార్సీపీ ఆత్మీయ భేటీ
బనశంకరి: ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడమే లక్ష్యంగా పార్టీ ఐటీ వింగ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి మద్దతుగా బెంగళూరులో నివాసం ఉండే రాయదుర్గం ప్రజలతో ఈనె 20వ తేదీ శనివారం బెంగళూరులో ఐటీ వింగ్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది. సుంకదకట్టెలో పీ అండ్ టీ లేఔట్లో మాగడి రోడ్డు శివనంది కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు సమావేశం ఆరంభమవుతుంది. ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఐటీ వింగ్ తెలిపింది. హాజయ్యేవారు ఈ లింక్లో https://-docs.googl.com/forms/d/e/1FAlpQLScSNUBRFOiOeQ6Yxaoqvcdnhxtjey9oBLcqW5BT-UsBmt2Q4A/viewform లో రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ముచ్చుమర్రి రాకేశ్రెడ్డి–6302989417 , శరన్– 7893830381, రాజశేఖర్రెడ్డి– 9703518965 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement