Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు

Published Thu, Mar 28 2024 1:50 AM

వివరాలు సేకరిస్తున్న పోలీసులు  - Sakshi

డిచ్‌పల్లి: బర్ధిపూర్‌ శివారు అమృతగార్డెన్స్‌ వద్ద రాంగ్‌ రూట్‌లో వచ్చిన కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురు కిందపడగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన సుమన్‌, బాల్‌రాజ్‌, గంగరాజు పెళ్లి పత్రికలు పంచడానికి బైక్‌పై రామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన స్థలంలో ఆగిన మరో కారును వెనకనుంచి వేగంగా వచ్చి ఆటో ఢీకొన్నది. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అమృతాగార్డెన్స్‌ ఎదుట పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసులు వచ్చి సహాయ చర్యలు అందించారు. సమాచారం అందుకున్న డిచ్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement